‘దిశ’ అరాచకానికి రెండేళ్లు.. ఇంకా పెరుగుతున్న కామాంధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా నిర్భయ ఘటన తరువాత అంతటి సంచలనాన్ని రేకెత్తించిన ఘటన దిశ హత్య. అర్ధరాత్రి ఒక డాక్టర్ ని నలుగురు వ్యక్తులు అతిదారుణంగా అత్యాచారం చేసి చంపిన ఘటన జరిగి నేటికీ రెండేళ్లు అవుతుంది. ఈ హత్య కేసులో పోలీస్ వారు తీసుకున్న నిర్ణయం ఎంతటి సంచలాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. నిందితులందరిని ఎన్ కౌంటర్ చేసి పడేశారు. ఆ ఘటన ఇప్పుడు తలచుకున్నా వెన్నులో వణుకుపుట్టక మానదు. అసలు ఆరోజు ఏం జరిగిందో మరోసారి తెలుసుకుందాం.
శంషాబాద్ శివారులోని తొండుపల్లి టోల్ గేట్ సమీపంలో నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశ తన పని ముగించుకొని స్కూటీమీద ఇంటికి బయల్దేరింది. మార్గమధ్యంలో ఆమె స్కూటీ ఆగిపోవడంతో తన చెల్లికి ఫోన్ చేసి భయమేస్తోంది అని చెప్పిన ఆమె తెల్లారి శవంలా కనిపించింది. అయితే ఆమె బైక్ కి ముందుగానే పంచర్ చేసిన నలుగురు దుర్మార్గులు.. ఆమెను హైదరాబాద్ శివారుల్లో షాద్ నగర్ వద్దకు లాకెళ్లి అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసి, సజీవ దహనం చేశారు. ఈ ఘటన దేశాన్ని కుదిపివేసింది. ఎన్నో వాదనలు వినిపించాయి.. ఎన్నో గొంతులు లేచాయి. ఎన్ని చేసినా ఆ యువతి ప్రాణం తిరిగి రాలేదు.. కానీ, అలాంటి నిందితులు మాత్రం ప్రాణాలతో ఉండకూడదని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నలుగురు నిందితులను వెతికిమరి కాల్చి పడేశారు. ఈ ఘటన తరువాత ఆడవారికి రక్షణ కల్పిస్తూ దిశా చట్టాన్ని అమలు చేశారు. ఇది తమను తాము రక్షించుకోవడంలో భాగంగా చేసిందని పోలీసులు చెబుతున్నా దీనిలో నిజానిజాలు తేల్చే దిశగా మానవ హక్కుల కమిషన్ కోర్టు విచారణ కొనసాగుతున్నాయి.
Also Read
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
ఇకపోతే ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ఆ ఘటన తరువాత దిశా అనే చట్టాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం.. కానీ, ఇంకా ఎంతోమంది ఆడవారు కామాంధుల కబంద హస్తాలలో నలిగిపోతూనే ఉన్నారు. నిత్యం కామాంధుల చేతుల్లో ఎవరో ఒకరు బలి అవుతూనే ఉన్నారు. చిన్నా పెద్ద, వావివరుస.. ఆడ,మగా అని తేడా లేదు.. 6 ఏళ్ళ బాలిక నుంచి 60 ఏళ్ళ బామ్మ వరకు రోజు ఎక్కడో చోట లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఈ కామాంధుల ఆగడాలకు అంతు ఎక్కడ ఉందో తెలియాలి.
తాజావార్తలు
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..