Two Constables Arrest: బస్సు డ్రైవర్ నుంచి రూ. 14 లక్షలు లూటీ.. ఇద్దరు కానిస్టేబుల్స్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ నుంచి రూ. 14 లక్షలు కాజేసిన ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ అరెస్టు అయ్యారు. వారిపై చీటింగ్ కేసు కింది కేసు నమోదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటుచేసుకుంది. కానిస్టేబుల్స్ కాచేసిన డబ్బు ఓ వ్యాపారికి చెందిన హవాల డబ్బుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇండోర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలు.. డిసెంబర్ 23న స్థానికి వ్యాపారి అంకిత్ జైన్ అహ్మదాబాద్కు చెందిన కన్హయ్య లాల్కు రూ. 14 లక్షలు ఒక పెట్టలో పెట్టి ప్రైవేటు బస్సు డ్రైవర్ ద్వారా తరలించాడు. ఈ క్రమంలో చందన్ నగర్ పోలీసుల స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ యోగేష్ చౌహాన్, దీపక్ యాదవ్లకు ఈ విషయం తెలిసింది.
Also Read: Viral Video: ప్రధానిపై ఇంత ద్వేషమా..! మోడీ పోస్టర్పైకి రాయి విసిరిన వ్యక్తి
Also Read
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
దీంతో దర్యాప్తు పేరుతో బస్సు తనిఖీ చేసిన సదరు కానిస్టేబుల్స్ క్యాష్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డబ్బును సీజ్ చేసినట్టు పోలీసు స్టేషన్కు సమాచారం ఇవ్వకుండా వారిద్దరే ఆ నగదును తీసుకున్నారు. దీంతో ఆ డబ్బు అందలేదని వ్యాపారి కన్హయ్య లాల్.. అంకిత్ జైన్కి తెలిపాడు. దీంతో అంకిత్ జైన్ బస్సు డ్రైవర్ నరేంద్ర తివారీపై చందన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ డబ్బును యోగేష్ చౌహాన్, దీపక్ యాదవ్ స్వాధీనం చేసుకున్నట్టు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. దీంతో వారిద్దరు ఆ డబ్బు కాజేసినట్టు తేలింది.
Also Read: Plane Lands on Frozen River: రన్వే అనుకుని నదిపై విమానం ల్యాండింగ్.. ప్రయాణికులు సురక్షితం
దీంతో పోలీసు ఉన్నతాధికారులు వారిపై చర్యలకు ఆదేశించారు. ఇద్దరు కానిస్టేబుల్స్ను సస్పెండ్ చేసి వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు, వ్యాపారవేత్త అంకిత్ జైన్, బస్సు డ్రైవర్తో పెద్ద మొత్తంలో డబ్బు తరలించడంపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్నట్లు అనుమానించిన పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తామని అదనపు డీసీపీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!