Theft Case: రామోజీరావు రూ. 30 లక్షలు చోరీ.. ప్రశ్నిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Theft Case: రోజురోజుకు హైదరాబాద్ లో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. బస్సులో, రైళ్లల్లో ఆగంతకులతో జాగ్రత్త గా ఉండమని ప్రయాణికులకు చెప్తున్నా ఎక్కడో ఓ చోట దుండగులు రకరకాలుగా దోచుకుంటున్నారు. తాజాగా విజయవాడ నుండి హైదరాబాద్ కి ఆర్టీసీ బస్సులో వస్తున్న రామోజీరావు అనే వ్యక్తి వద్ద రూ. 30 లక్షలు కొట్టేశారు దుండగులు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన రామోజీరావు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్స్ రంగంలో ఉన్న ఒక వ్యక్తి వద్ద పనిచేస్తున్నాడు. మియాపూర్ లో ఒక సైట్ కి అడ్వాన్స్ ఇచ్చి రమ్మని రామోజీరావు కు రూ. 30 లక్షలు ఇచ్చి పంపించాడు యజమాని.
ఇక ఆ డబ్బుతో గతరాత్రి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కాడు రామోజీ రావు. అయితే ఉదయం నార్కట్ పల్లి వచ్చాకా బ్యాగ్ చూసుకొంటే డబ్బు కనిపించలేదు. వెంటనే బాధితుడు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును నార్కట్ పల్లి పోలీసులకు బదిలీ చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు బస్సులో ఉన్న ప్యాసింజర్ల లిస్ట్ లో ఉన్నవారందరిని తనిఖీ చేస్తున్నారు. మరోపక్క డబ్బు కొట్టేసి నాటకం ఆడుతున్నాడేమో అన్న అనుమానం తో రామోజీరావును కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నార్కట్ పల్లి లో బ్యాగ్ పొతే హయత్ నగర్ లో ఎందుకు ఫిర్యాదు చేశావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!