Bridegroom Cheating: నిత్య పెళ్లికొడుకు.. ఆ ఒక్క తప్పు చేసి, అడ్డంగా దొరికాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu Bridegroom Arrested For Marrying Minor Girl: కొందరు ప్రబుద్ధులు ఎందుకో ఒక్క పెళ్లితో సంతృప్తి చెందట్లేదు. నచ్చిన ప్రతీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ.. ‘నిత్య పెళ్లికొడుకు’ అవతారాలు ఎత్తుతున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంటూ.. మోసాలకు పాల్పడుతున్నారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కూడా నిత్య పెళ్లికొడుకు అవతారం ఎత్తాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే.. నాలుగో పెళ్లి విషయంలో చేసిన తప్పు కారణంగా, అడ్డంగా బుక్కయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలోని బోధికులం గ్రామానికి చెందిన సతీష్(38)కి, కొన్ని సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన రేఖను వివాహం చేసుకున్నాడు. మొదట్లో ఇద్దరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ.. ఆ తర్వాత చిన్న చిన్న విషయాల్లో మనస్పర్థలు ఏర్పడటం, అవి పెద్దవిగా మారడంతో ఇద్దరు విడిపోయారు.
అలా రేఖకు విడాకులిచ్చిన కొన్ని రోజుల్లోనే లత అనే మరో యువతిని సతీష్ పెళ్లి చేసుకున్నాడు. ఒకవైపు ఆమెతో కాపురం చేస్తుండగానే.. అతనికి మురుగలక్ష్మితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అది ప్రేమగా మారడంతో.. లతకు తెలియకుండా మురుగలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. అరుప్పుకోటైలో మరో కాపురం పెట్టాడు. అంతటితో మనోడి పెళ్లి కోరిక తీరలేదు. అదే ప్రాంతంలో మేకలు మేపుతున్న ఓ 17 ఏళ్ల యువతితో సతీష్కి పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి అందంగా ఉండటంతో, ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదట మాయమాటలు చెప్పి, ఆమెని వలలో వేసుకున్నాడు. అనంతరం పెళ్లి చేసుకుంటే బాగా చూసుకుంటానని నమ్మించాడు. పాపం, అతని మాయమాటలకు పడిపోయి అమ్మాయి ఒప్పుకుంది. దీంతో.. ఆ యువతిని పెళ్లి చేసుకొని, మరో చోట కొత్త కాపురం పెట్టాడు. అయితే.. మేకలు మేపడానికి వెళ్లిన తన కూతురు తిరిగి రాకపోవడం, ఎక్కడా ఆచూకీ కనిపించకపోవడంతో.. ఆ యువతి తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ యువతి ఉళుందూరుపేటలోని సతీష్ సోదరి ఇంట్లో ఉందని గుర్తించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకొని, ఆమెను రక్షించి, విరుదునగర్లోని ఒక ఆశ్రమంలో ఉంచారు. సతీష్ కోసం గాలించగా.. అతడు అరుప్పుకోటై సమీపంలోని పాలవనత్తం ప్రాంతంలో తలదాచుకున్నట్లు బుధవారం పోలీసులకు సమాచారం అందింది. దాంతో, ఆ ప్రాంతానికి వెళ్లి, సతీష్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మేజర్ కాని యువతిని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడంతో.. పోలీసులు అతడిపై ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?