Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
- తమిళనాడులో షాకింగ్ సంఘటన..
- 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన స్నేహితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో షాకింగ్ సంఘటన జరిగింది. కోయంబత్తూర్ జిల్లాలో 13 ఏళ్ల బాలుడిని, అతడి ఇద్దరు మైనర్ స్నేహితులు హత్య చేసి పాతిపెట్టారు. బాధితుడు జిల్లాలోని ఇరుగూర్ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. శనివారం మృతి చెందిన బాలుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి నిర్మానుష్యంగా ఉన్న ఒక కాలువ వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లారు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత వీరి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మరణించిన బాలుడు మద్యం మత్తులో ముందుగా మరొక బాలుడిపై సీసాతో దాడి చేయడంతో గొడవ హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో ఇద్దరు బాలుడు ఎదురుదాడి చేసి హత్య చేసినట్లు తెలిసింది. బాలుడు మరణించడంతో భయపడిన ఇద్దరు బాలురు పోలీసులు అరెస్ట్ చేస్తారని, మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టి ఇంటికి వెళ్లారు.
Also Read
బాధితుడి తండ్రి తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరు బాలురను ప్రశ్నించడంతో ఆదివారం రాత్రి తాము చేసిన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపించారు. మైనర్లను అబ్జర్వేషన్ హోమ్కు పంపించనున్నారు.
ఈ ఘటన తమిళనాడులో సంచలనంగా మారింది. మృతుడు, చంపినవాళ్లు అంతా మైనర్లు కావడంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. వెన్నులో వణుకు పుట్టించేదిగా అభివర్ణించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని సరైన దిశలో మార్గనిర్దేశం చేయాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!