Pune: భార్యపై అనుమానం.. 3 ఏళ్ల కొడుకు గొంతు కోసి చంపిన టెక్కీ..
- భార్యపై అనుమానంతో కొడుకు హత్య..
- మూడున్నరేళ్ల బాలుడి గొంతు కోసి చంపిన తండ్రి..
- మహరాష్ట్ర పూణేలో సంఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune: భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం కారణంగా మూడున్నరేళ్ల కొడుకు అన్యాయంగా బలయ్యాడు. పూణేకు చెందిన 38 ఏళ్ల టెక్కీ తన కొడుకు గొంతు కోసి చంపేశాడు. శరీరాన్ని అటవీ ప్రాంతంలో పారేశాడు. పూణేలోని చందన్ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత, నిందితుడైన పిల్లాడి తండ్రి లాడ్జిలో మద్యం సేవించి కనిపించాడు.
హిమ్మత్ మాధవ్ తికేటి, మాధవ్ తికేటికి, ఆయన భార్య స్వరూపల చిన్న కుమారుడు. ఆ కుటుంబం విశాఖపట్నం నుంచి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మాధవ్, స్వరూపను అనుమానించాడు. దీంతో గురువారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపం, అనుమానంతో ఉన్న మాధవ్ తన చిన్న కొడుకును తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు మధ్యాహ్నం 12.30 గంటలకు బార్కి వెళ్లాడు, అక్కడ నుంచి సూపర్ మార్కెట్కి, ఆ తర్వాత చందన్ నగర్ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు.
Also Read
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
Read Also: KKRvsRCB: 16 ఏళ్ల క్రితం కేకేఆర్, ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్.. ఏ టీం గెలిచిందంటే?
సమయం గడిచిన కొద్ది ఎలాంటి కాంటాక్ట్ లేకపోవడంతో స్వరూప, తన భర్త, కొడుకు కనిపించడం లేదని చందన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. మాధవ్ చివరిసారిగా గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు తన కొడుకుతో కనిపించాడు. కానీ ఆ తర్వాత సాయంత్రం 5 గంటల ఫుటేజీలో అతడు ఒంటరిగా బట్టలు కొనుగోలు చేస్తున్నట్లు కనిపించాడు.
మాధవ్ మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అతడిని ఓ లాడ్జిలో పట్టుకున్నారు. తాగి మత్తులో ఉన్న మాధవ్, స్పృహ లోకి వచ్చిన తర్వాత నేరాన్ని ఒప్పుకున్నాడు. సంఘటనా స్థలంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. గొంతు కోసం హత్య చేసినట్లు తెలిసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి పంపామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!