Pune: భార్యపై అనుమానం.. 3 ఏళ్ల కొడుకు గొంతు కోసి చంపిన టెక్కీ..
- భార్యపై అనుమానంతో కొడుకు హత్య..
- మూడున్నరేళ్ల బాలుడి గొంతు కోసి చంపిన తండ్రి..
- మహరాష్ట్ర పూణేలో సంఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune: భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం కారణంగా మూడున్నరేళ్ల కొడుకు అన్యాయంగా బలయ్యాడు. పూణేకు చెందిన 38 ఏళ్ల టెక్కీ తన కొడుకు గొంతు కోసి చంపేశాడు. శరీరాన్ని అటవీ ప్రాంతంలో పారేశాడు. పూణేలోని చందన్ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత, నిందితుడైన పిల్లాడి తండ్రి లాడ్జిలో మద్యం సేవించి కనిపించాడు.
హిమ్మత్ మాధవ్ తికేటి, మాధవ్ తికేటికి, ఆయన భార్య స్వరూపల చిన్న కుమారుడు. ఆ కుటుంబం విశాఖపట్నం నుంచి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మాధవ్, స్వరూపను అనుమానించాడు. దీంతో గురువారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపం, అనుమానంతో ఉన్న మాధవ్ తన చిన్న కొడుకును తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు మధ్యాహ్నం 12.30 గంటలకు బార్కి వెళ్లాడు, అక్కడ నుంచి సూపర్ మార్కెట్కి, ఆ తర్వాత చందన్ నగర్ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు.
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
Read Also: KKRvsRCB: 16 ఏళ్ల క్రితం కేకేఆర్, ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్.. ఏ టీం గెలిచిందంటే?
సమయం గడిచిన కొద్ది ఎలాంటి కాంటాక్ట్ లేకపోవడంతో స్వరూప, తన భర్త, కొడుకు కనిపించడం లేదని చందన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. మాధవ్ చివరిసారిగా గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు తన కొడుకుతో కనిపించాడు. కానీ ఆ తర్వాత సాయంత్రం 5 గంటల ఫుటేజీలో అతడు ఒంటరిగా బట్టలు కొనుగోలు చేస్తున్నట్లు కనిపించాడు.
మాధవ్ మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అతడిని ఓ లాడ్జిలో పట్టుకున్నారు. తాగి మత్తులో ఉన్న మాధవ్, స్పృహ లోకి వచ్చిన తర్వాత నేరాన్ని ఒప్పుకున్నాడు. సంఘటనా స్థలంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. గొంతు కోసం హత్య చేసినట్లు తెలిసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి పంపామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
-
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి