Kolkata: లా కాలేజ్లో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో తృణమూల్ నేత..
- కోల్కతాలో మరో ఆర్జీకర్ లాంటి ఘటన..
- లా విద్యార్థినిపై క్యాంపస్లోనే గ్యాంగ్ రేప్..
- నిందితుల్లో అధికార టీఎంసీ స్టూడెంట్ లీడర్..
Kolkata: కోల్కతాలో మరో ఆర్జీకర్ లాంటి ఘటన జరిగింది. కస్బా లా కాలేజీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం క్యాంపస్ లో ఈ ఘటన జరిగింది. గురువారం అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, మరోకరిని కాలేజీలో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. గతేడాది కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన పీజీ వైద్యురాలి హత్యాచార ఘటనను తాజా కేసు గుర్తు చేసింది.
నిందితుల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకుడు కూడా ఉన్నాడు. 24 ఏళ్ల బాధితురాలు పరీక్షలకు సంబంధించిన ఫామ్స్ నింపేందుకు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కాలేజీకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు ప్రకారం,ఆమె మొదట కాలేజీ యూనియన్ గదిలో కూర్చొంది. ఆ తర్వాత ప్రధాన నిందితుడు కాలేజ్ గేట్ని లాక్ చేయమని ఆదేశించాడు. క్యాంపస్ సెక్యూరిటీ గార్డు గదిలో ఆమెపై అత్యాచారం జరిగింది.
Also Read
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Brazilian Athlete: స్విమ్ రేస్ లో ప్రముఖ బ్రెజిలియన్ అథ్లెట్ మృతి..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- Affair Doubt: ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య వీడియో కాల్లో ఉండగా సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త.. అది చూసి..
Read Also: CM Chandrababu: కమ్యూనిజం… సోషలిజం.. క్యాప్టిలిజం… అన్ని ఇజాలు పోయాయి.. టూరిజం ఒక్కటే మిగిలింది..!
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా FIR ప్రకారం, ప్రధాన నిందితులు తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ (TMCP) దక్షిణ కోల్కతా జిల్లా మాజీ విద్యార్థి, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) గా గుర్తించారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ జైబ్ అహ్మద్(19), మరో విద్యార్థి 20 ఏళ్ల ప్రమిత్ ముఖర్జీ నిందితులుగా ఉన్నారు. నిందితుల్లో మిశ్రా, అహ్మద్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడో నిందితుడు ముఖర్జీని గురువారం తెల్లవారుజామున అతడి ఇంటి నుంచి అరెస్ట్ చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేశారు. నేరం జరిగిన ప్రదేశం నుంచి ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తోంది.
ఈ ఘటనపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందించారు. ఈ సంఘటనను భయంకరమైందిగా అభివర్ణించారు. ఇటీవల ఆర్జీకల్ హత్యాచార ఘటనను ప్రస్తావిస్తూ.. బెంగాల్లో మహిళలపై నిరంతరం నేరాలు జరుగుతున్నాయని అధికార టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ప్రభుత్వం మహిళలకు పీడకలగా మారుస్తోందని దుయ్యబట్టారు. బాధితురాలికి అండగా బీజేపీ నిలుస్తుందని చెప్పారు. కోల్కతా మేయర్ ఫిర్హద్ హకీమ్ మాట్లాడుతూ.. తనకు ఈ ఘటన గురించి తెలియదని, పోలీసులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?