SI Suicide: గన్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎంతో భవిష్యత్తు వున్న యువత బలవన్మరణాలను ఆశ్రయిస్తున్నారు. కాకినాడ జిల్లాలో గన్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ గోపాల కృష్ణ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నిన్న సీఎం బందోబస్తు కి వెళ్ళి వచ్చిన ఎస్ ఐ గోపాలకృష్ణ రాత్రి ఇంట్లో గన్ తో కాల్చుకున్నాడు. గోపాలకృష్ణది విజయవాడ దగ్గర జగ్గయ్య చెరువు సొంత ఊరు. 2014 సంవత్సరం బ్యాచ్ లో ఎస్ఐగా సెలక్ట్ అయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు గదిలో పిల్లలు, భార్య నిద్రిస్తుండగా హాల్లో గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం విషాదం నింపింది. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఏమై వుంటాయా అని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.గతంలో కాకినాడలో ట్రాఫిక్ లో పని చేశారు గోపాల కృష్ణ. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై ఇంటికి చేరుకుంటున్నారు పోలీసులు. కాకినాడ జీ జీ హెచ్ కి ఎస్సై గోపాలకృష్ణ మృతదేహం తరలించారు. ఎస్పీ రవీంద్రనాధ్ బాబు జీ జీ హెచ్ కి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
గోపాలకృష్జ భార్య పేరు పావని. పెళ్లి అయ్యి ఐదు ఏళ్ళు అవుతుంది. ఇద్దరు పిల్లలు.. పాప వయస్సు 3 ఏళ్ళు, బాబు వయస్సు ఏడాది.
ఏడాది క్రితం ట్రాఫిక్ నుంచి లా అండ్ ఆర్డర్ ఎస్సై గా బదిలీ అయ్యారు గోపాల కృష్ణ. మార్చురీ, ఇంటి దగ్గర భారీ పోలీస్ బందో బస్తు ఏర్పాటుచేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఇంట్లోనే ఉన్నారు భార్య, బంధువులు.
విమానం కూలి…
మరోవైపు ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం సంభవించింది. రాయ్పుర్ ఎయిర్పోర్ట్లో ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయిందని రాయ్పుర్ విమానాశ్రయ డైరెక్టర్ రాకేశ్ సహాయ్ వెల్లడించారు. రన్వే చివర్లో ప్రమాదానికి గురైందని చెప్పారు. పైలెట్లకు ఈ విమానం ద్వారా శిక్షణ ఇస్తుంటారు. విమానంలో సాంకేతిక లోపం వల్ల ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం.ఈ ప్రమాదంలో కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ ఏపీ శ్రీవాస్తవలు మృతి చెందారు. పైలెట్ల మృతి పట్ల ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!