Shocking Survey: ఏపీలో సైకో భర్తలు.. టార్చర్ పెట్టడంలో నెం. 1 అంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్త అంటే భరించేవాడు అంటారు కొందరు.. భర్త అంటే బాధ పెట్టేవాడు అంటారు మరికొందరు.. అయితే ఏది చెప్పినా భార్యాభర్తల మధ్య అనుబంధం పాలునీళ్ళులా ఉండాలంటారు పెద్దలు.. కానీ ప్రస్తుతం కాలంలో భర్తలు సైకోలు గా కాదు కాదు.. అంతకంటే ఎక్కువగా భార్యలను హింసిస్తున్నారు.. ముఖ్యంగా ఈ కేటగిరి భర్తలు అంధ్రప్రదేశ్ లో ఎక్కవగా ఉన్నారట.. ఈ విషయం మేము చెప్పడం లేదు.. కేంద్రం సర్వే చేసి మరి చెప్తోంది. ఏపీలోనే సైకో భర్తలు ఉన్నారని.. జాతీయ కుటుంబ మరియు ఆరోగ్య సర్వే లో ఏపీలో ఆశ్చర్యపరిచే నిజాలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో 18-49 ఏళ్ల వయస్సున్న పెళ్లయిన మహిళల్లో 35 శాతం మంది శారీరక లేదా లైంగిక హింసను ఎదుర్కొన్నారని తెలిపింది. అందులోనూ ఆ హింసను తట్టుకొని జీవిస్తున్న మహిళలు కొంతమంది ఉండగా.. భర్తల వేధింపులు తట్టుకోలేని మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారట. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ 35% మంది బాధితులలో 4% మంది మహిళలు గర్భం తో ఉండడం.. వారిని కూడా సైకో భర్తలు వదలడం లేదని సర్వే చెప్పుకొస్తుంది. మాటలతో వేధించడంలో ఏపీ భర్తల తర్వాతే ఎవరైనా అని సమాచారం.
ఇంకా సర్వే ఏం తెలిపిందంటే.. 18-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 4% మంది గర్భవతులు ఉన్నారని, ఇలా గర్భవతిగా ఉన్న సమయంలో హింసను ఎదుర్కొంటున్న వారిలో చదువుకున్న మహిళలు 12%, 3-4 మంది పిల్లలు ఉన్న మహిళలు 6%, వితంతువులు విడాకులు తీసుకున్నవారు, విడిపోయిన లేదా విడిచిపెట్టిన మహిళలు 8% భర్తల ద్వారా, మగవారి ద్వారా హింసను ఎదుర్కొంటున్నారని రాసుకొచ్చింది. శారీరకంగా, లైంగికంగా భర్తలు పెట్టే బాధలను భరిస్తున్నారట.. ఇక హింసించడంలోనూ ఈ సైకోలు కొత్త పద్దతులను సృష్టించడంగమనార్హం.. 24% మంది భర్తలు చెప్పుతో రోజూ భార్యలను కొట్టడం చేస్తుంటే.. 11% మంది భర్తలు, భార్యలను తమపైకి నెట్టబడడం లేదా విసిరి కొట్టడం, తన్నడం, లాగడం లేదా కొట్టడం వంటి చర్యలు ఎదుర్కొన్నట్లు సర్వేలో తేలింది. 8% మంది తమ చేతిని మెలితిప్పి, పిడికిలితో లేదా వారికి హాని కలిగించే వాటితో కొట్టడం వంటివి ఎదుర్కొన్నారని తెలిపింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే లైంగికంగా వేధించేవాళ్ళు.. 18-49 ఏళ్ల వయసున్న పెళ్లయిన మహిళల్లో మూడు శాతం మంది తమ భర్తలు తమకు ఇష్టం లేకపోయినా శారీరకంగా బలవంతం చేశారని తెలిపింది. భర్తల భార్యలను హింసించేటప్పుడు అది మానసింకంగా అయిన లేదా శారీరకంగా అయిన ఆ సమయంలో దాదాపు 76% మంది భర్తలు తరచుగా తాగి ఉంటారని చెప్పుకొచ్చారు. ఇక దీని బట్టి ఎన్ హెచ్ ఎఫ్ ఎస్ సర్వే ప్రకారం రాష్ట్రంలో తాగిన సమయంలో ఎక్కువ హింస మహిళల పై జరుగుతుందని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయమై రాజకీయ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
తాజావార్తలు
-
Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
-
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్లైన్..
-
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!