Shocking Survey: ఏపీలో సైకో భర్తలు.. టార్చర్ పెట్టడంలో నెం. 1 అంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్త అంటే భరించేవాడు అంటారు కొందరు.. భర్త అంటే బాధ పెట్టేవాడు అంటారు మరికొందరు.. అయితే ఏది చెప్పినా భార్యాభర్తల మధ్య అనుబంధం పాలునీళ్ళులా ఉండాలంటారు పెద్దలు.. కానీ ప్రస్తుతం కాలంలో భర్తలు సైకోలు గా కాదు కాదు.. అంతకంటే ఎక్కువగా భార్యలను హింసిస్తున్నారు.. ముఖ్యంగా ఈ కేటగిరి భర్తలు అంధ్రప్రదేశ్ లో ఎక్కవగా ఉన్నారట.. ఈ విషయం మేము చెప్పడం లేదు.. కేంద్రం సర్వే చేసి మరి చెప్తోంది. ఏపీలోనే సైకో భర్తలు ఉన్నారని.. జాతీయ కుటుంబ మరియు ఆరోగ్య సర్వే లో ఏపీలో ఆశ్చర్యపరిచే నిజాలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో 18-49 ఏళ్ల వయస్సున్న పెళ్లయిన మహిళల్లో 35 శాతం మంది శారీరక లేదా లైంగిక హింసను ఎదుర్కొన్నారని తెలిపింది. అందులోనూ ఆ హింసను తట్టుకొని జీవిస్తున్న మహిళలు కొంతమంది ఉండగా.. భర్తల వేధింపులు తట్టుకోలేని మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారట. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ 35% మంది బాధితులలో 4% మంది మహిళలు గర్భం తో ఉండడం.. వారిని కూడా సైకో భర్తలు వదలడం లేదని సర్వే చెప్పుకొస్తుంది. మాటలతో వేధించడంలో ఏపీ భర్తల తర్వాతే ఎవరైనా అని సమాచారం.
ఇంకా సర్వే ఏం తెలిపిందంటే.. 18-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 4% మంది గర్భవతులు ఉన్నారని, ఇలా గర్భవతిగా ఉన్న సమయంలో హింసను ఎదుర్కొంటున్న వారిలో చదువుకున్న మహిళలు 12%, 3-4 మంది పిల్లలు ఉన్న మహిళలు 6%, వితంతువులు విడాకులు తీసుకున్నవారు, విడిపోయిన లేదా విడిచిపెట్టిన మహిళలు 8% భర్తల ద్వారా, మగవారి ద్వారా హింసను ఎదుర్కొంటున్నారని రాసుకొచ్చింది. శారీరకంగా, లైంగికంగా భర్తలు పెట్టే బాధలను భరిస్తున్నారట.. ఇక హింసించడంలోనూ ఈ సైకోలు కొత్త పద్దతులను సృష్టించడంగమనార్హం.. 24% మంది భర్తలు చెప్పుతో రోజూ భార్యలను కొట్టడం చేస్తుంటే.. 11% మంది భర్తలు, భార్యలను తమపైకి నెట్టబడడం లేదా విసిరి కొట్టడం, తన్నడం, లాగడం లేదా కొట్టడం వంటి చర్యలు ఎదుర్కొన్నట్లు సర్వేలో తేలింది. 8% మంది తమ చేతిని మెలితిప్పి, పిడికిలితో లేదా వారికి హాని కలిగించే వాటితో కొట్టడం వంటివి ఎదుర్కొన్నారని తెలిపింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే లైంగికంగా వేధించేవాళ్ళు.. 18-49 ఏళ్ల వయసున్న పెళ్లయిన మహిళల్లో మూడు శాతం మంది తమ భర్తలు తమకు ఇష్టం లేకపోయినా శారీరకంగా బలవంతం చేశారని తెలిపింది. భర్తల భార్యలను హింసించేటప్పుడు అది మానసింకంగా అయిన లేదా శారీరకంగా అయిన ఆ సమయంలో దాదాపు 76% మంది భర్తలు తరచుగా తాగి ఉంటారని చెప్పుకొచ్చారు. ఇక దీని బట్టి ఎన్ హెచ్ ఎఫ్ ఎస్ సర్వే ప్రకారం రాష్ట్రంలో తాగిన సమయంలో ఎక్కువ హింస మహిళల పై జరుగుతుందని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయమై రాజకీయ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
తాజావార్తలు
-
Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
-
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
-
BSNL: బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్.. రూ. 51కే రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్
-
Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
-
CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!