TDP Leader Murder Case: టీడీపీ నేత హత్య కేసును ఛేదించిన పోలీసులు
- ముదినేనివడ్డెపల్లెలో ఈ నెల 2న టీడీపీ నేత తిరుపతి వారాధి హత్య..
- అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో ఘటన..
- హత్య కేసును ఛేదించిన రాయచోటి పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Leader Murder Case: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ముదినేనివడ్డెపల్లెలో ఈ నెల 2వ తేదీన జరిగిన తెలుగుదేశం పార్టీ నేత తిరుపతి వారాధి (77) హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన రోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఆ ఘటనపై ఆరా తీశారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. దీంతో, పోలీసులు ఎట్టకేలకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సంబేపల్లి మండలం దుద్యాల గ్రామానికి చెందిన తిరుపతి వారాధి (77) కొన్నేళ్ల క్రితం ముదినేనివడ్డెపల్లె కు వచ్చి స్థిరపడ్డారు.
Read Also: Lift Accident: మరో పసిప్రాణాన్ని బలిగొన్న లిఫ్ట్.. నాలుగున్నరేళ్ల చిన్నారి మృతి
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
అయితే, గ్రామంలో ప్రజలకు అవసరమైన పనులు చేసి పెడుతూ వస్తుండేవారు. ఇటీవల ఉపాధి హామీ పథకం కింద 5 లక్షల పనులు చేయించేందుకు కాంట్రాక్టు పనులు దక్కించుకున్నారు. రహదారి నిర్మాణానికి మరో 49 లక్షల విలువైన పని వచ్చిందని స్థానికులకు చెప్పారు. దీంతో అదే గ్రామానికి చెందిన మదనపల్లి చిన్నికృష్ణ, బంగారువాండ్లపల్లెకు చెందిన యోగానందరెడ్డి అలియాస్ ఆనంద్ రెడ్డిలు కాంట్రాక్టు పనుల కోసం పోటీ పడడమే కాకుండా ఎక్కడ నుంచో వచ్చి తమ గ్రామంలో పెత్తనం చెలాయిస్తున్నాడని వారు తిరుపతి వారాధి పై ద్వేషం పెంచుకున్నారు. ఈ నెల 2వ తేదీన మల్లూరమ్మ గుడి వద్ద వేప చెట్టు కింద తిరుపతి వారాధి నిద్రిస్తుండగా చిన్నికృష్ణ, ఆనంద రెడ్డిలు కలిసి బండరాయితో కొట్టి చంపినట్లు తమ విచారణలో తేలిందని రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్, ఎస్ఐ భక్తవత్సలం వివరించారు. హత్య కేసులోని ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!