Rajasthan: భార్య భర్తల మధ్య గొడవలు..ఆసుపత్రి పాలైన 17 మంది.. ఏం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యా భర్తల మధ్య గొడవలు రావడం సహజం.. అయితే కొన్ని గొడవలు మాత్రం చిలికి చిలికి పెద్దవి అవుతాయి..అప్పుడు కుటుంబాలు నాశనం అవుతాయి.. కానీ ఓ ఘటన వల్ల ఏకంగా 17 మంది ఆసుపత్రి పాలయ్యిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.. ఝులావర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఝలావర్ లో గరీబ్ నవాజ్ కాలనీలో రాజిక్ అన్సారీ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను కాంగ్రేస్ కౌన్సిలర్. ఇతని భార్యకు ఇతనికి ఈమధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరి గొడవల కారణంగా భార్యాభర్తలు ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు…
అయితే, ఏదోక కారణం చేత గొడవలు పడేవారు.. అయితే తాజాగా ఒక గొడవ జరిగింది.. తమ గొడవలో కోపంతో రెచ్చిపోయి ఒకరిని మరొకరు కొట్టుకున్నారు. తరువాత ఉక్రోశం తో తమ తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు.. ఇద్దరి బంధువులు కలిసి వచ్చారు.. తీవ్రంగా కొట్టుకున్నారు.. ఈ క్రమంలో అడ్డు వచ్చిన బంధువుల కు తీవ్రంగా దెబ్బలు తగిలాయి.. భార్యాభర్తల మధ్య గొడవ ఆపి వారిని శాంత పరచాల్సిందిపోయి అక్కడికి వచ్చిన వారు కూడా గొడవలో తలదూర్చారు. వారంతా రెచ్చిపోయి రాళ్లు రువ్వుకుని, కర్రల తో దాడి చేసుకున్నారు… ఈ ఘటన లో 17 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి..
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
రాత్రి సమయంలో ఉన్నట్టుండి అరుపుల తో గొడవ మొదలైందని, కొద్దిసేపటిలోనే అక్కడ వాతావరణం చాలా గందరగోళంగా మారిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. గాయపడిన వారిని ప్రైవేట్ వాహనాలలోనూ, అంబులెన్స్ లలోనూ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటం తో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు.. గొడవకు కారణం ఏంటని పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. మొత్తానికి ఈ ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..
తాజావార్తలు
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?