Rajasthan: దారుణం.. భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రతాప్గఢ్ జిల్లాలో ఓ గిరిజన మహిళను ఆమె భర్త నగ్నంగా చేసి బహిరంగం ఊరేగించారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ దారుణానికి పాల్పడిన భర్తతో పాటు బాధిత మహిళ అత్తమామాలను అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బహిరంగంగా కొట్టి, బట్టలు విప్పి నగ్నంగా ఊరేగించాడు. ఈ ఉదంతాన్ని పలువరు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ కేసులో భర్త కనా మీనా, మరో ఇద్దరు నాథు మీనా, వెలియా మీనాగాలను నిందితులుగా గుర్తించారు. అరెస్ట్ చేసే క్రమంలో వీరు తప్పించుకునే ప్రయత్నం చేయగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారు.
Also Read
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
Read Also: Horse Viral Video: మొదటిసారి అద్దంలో చూసుకున్న గుర్రం.. ఏం చేసిందంటే?
ఈ ఘటన సోమవారం జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది పెళ్లి చేసుకున్న మహిళ, పక్కింటి వ్యక్తితో పారిపోయిందని భర్త, అత్తామామాలు కొట్టారు. దీంతో వీరంతా కలిసి మహిళలను నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటన వైరల్ గా మారడంతో, ఇకపై ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేయవద్దని ప్రతాప్గఢ్ పోలీసులు కోరారు. ఈ ఘటనలో భర్త, అత్తామామలతో పాటు మొత్తం 10 మందిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 294 (అశ్లీల చట్టం), 354 (మహిళలపై దాడులు), 365 (కిడ్నాప్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 (అసభ్యకరమైన విషయాలను ప్రసారం చేయడం) కింద కేసు నమోదు చేశారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. పెళ్లయినా మరో వ్యక్తితో కలిసి తన భార్య వెళ్లిపోయిందనే కోపంతో మహిళ అత్తమామలు ఆమెను కిడ్నాప్ చేసి తమ గ్రామానికి తీసుకెళ్లి కొట్టి నగ్నంగా ఊరేగించారని రాజస్థాన్ డీజీపీ ఉమేష్ మిశ్రా తెలిపారు. దీన్ని హేయమైన చర్యగా అభిర్ణించారు. ఈ ఘటన పొలిటికల్ దుమారాన్ని రేపింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దీనిపై స్పందిస్తూ.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించారు. మరో బీజేపీ నేత అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే రాహుల్ గాంధీ, గెహ్లాట్ రాజీనామాను ఎప్పుడు కోరుతారని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!