Rajasthan: దారుణం.. భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రతాప్గఢ్ జిల్లాలో ఓ గిరిజన మహిళను ఆమె భర్త నగ్నంగా చేసి బహిరంగం ఊరేగించారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ దారుణానికి పాల్పడిన భర్తతో పాటు బాధిత మహిళ అత్తమామాలను అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బహిరంగంగా కొట్టి, బట్టలు విప్పి నగ్నంగా ఊరేగించాడు. ఈ ఉదంతాన్ని పలువరు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ కేసులో భర్త కనా మీనా, మరో ఇద్దరు నాథు మీనా, వెలియా మీనాగాలను నిందితులుగా గుర్తించారు. అరెస్ట్ చేసే క్రమంలో వీరు తప్పించుకునే ప్రయత్నం చేయగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారు.
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
Read Also: Horse Viral Video: మొదటిసారి అద్దంలో చూసుకున్న గుర్రం.. ఏం చేసిందంటే?
ఈ ఘటన సోమవారం జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది పెళ్లి చేసుకున్న మహిళ, పక్కింటి వ్యక్తితో పారిపోయిందని భర్త, అత్తామామాలు కొట్టారు. దీంతో వీరంతా కలిసి మహిళలను నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటన వైరల్ గా మారడంతో, ఇకపై ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేయవద్దని ప్రతాప్గఢ్ పోలీసులు కోరారు. ఈ ఘటనలో భర్త, అత్తామామలతో పాటు మొత్తం 10 మందిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 294 (అశ్లీల చట్టం), 354 (మహిళలపై దాడులు), 365 (కిడ్నాప్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 (అసభ్యకరమైన విషయాలను ప్రసారం చేయడం) కింద కేసు నమోదు చేశారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. పెళ్లయినా మరో వ్యక్తితో కలిసి తన భార్య వెళ్లిపోయిందనే కోపంతో మహిళ అత్తమామలు ఆమెను కిడ్నాప్ చేసి తమ గ్రామానికి తీసుకెళ్లి కొట్టి నగ్నంగా ఊరేగించారని రాజస్థాన్ డీజీపీ ఉమేష్ మిశ్రా తెలిపారు. దీన్ని హేయమైన చర్యగా అభిర్ణించారు. ఈ ఘటన పొలిటికల్ దుమారాన్ని రేపింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దీనిపై స్పందిస్తూ.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించారు. మరో బీజేపీ నేత అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే రాహుల్ గాంధీ, గెహ్లాట్ రాజీనామాను ఎప్పుడు కోరుతారని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!