Meerpet Murder Case: పక్కా ప్రణాళిక ప్రకారం హత్య.. సీపీ సంచలన విషయాలు
- మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన సీపీ
- అంతకముందు గురుమూర్తి ఇంట్లో, మీర్పేట్ పెద్ద చెరువు వద్ద సీన్ రీ-కన్స్ట్రక్షన్
- భార్య వెంకట మాధవిని కిరాతంగా హత్య చేసిన గురుమూర్తి అరెస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో మీర్పేట్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. కాగా భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి చంపినట్లు నిన్న పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో రాచకొండ సీపీ సుధీర్ బాబు సంచలన విషయాలు మీడియాకు తెలిపారు. 16వ తేదీ ఉదయం 8 గంటలకు నిద్రలేచిన వెంటనే మాధవి గురుమూర్తిల మధ్య గొడవ స్టార్ట్ అయిందని అన్నారు. గొడవ కావడంతో మాధవిని చంపాలని గురుమూర్తి అనుకున్నాడు.. అందుకోసమే ఆమెని కొట్టాడని సీపీ వెల్లడించారు. ఆమె చెంపపై కొట్టడంతో గోడకు తాకి కుప్పకూలిపోయింది.. వెంటనే ఆమె స్పృహ కోల్పోయినా, ఆమెను చంపాలన్న ఉద్దేశంతో ఆమె గొంతు పిసికి చంపాడని తెలిపారు. ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాడు.. ఆ తర్వాత మాధవి శరీరంపై ఉన్న బట్టలను తొలగించాడు.. మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకొని వెళ్ళాడు.. కిచెన్లో నుండి కత్తి తీసుకొని వచ్చాడని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
Read Also: Mumbai: పెట్రోల్, డీజిల్ వాహనాలు బ్యాన్.. ఫడ్నవిస్ ప్రభుత్వం ప్లాన్!
Also Read
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
మొదట మాధవి భుజాలను కట్ చేశాడు.. డెడ్ బాడీ నుండి చేతులను వేరు చేశాడు.. ఆ తర్వాత డెడ్ బాడీ నుండి కాళ్లను కూడా వేరు చేశాడు.. కాళ్లు, చేతులను ముక్కలు ముక్కలుగా చేశాడు.. ముక్కలుగా చేసిన కాళ్లు చేతుల భాగాలను బకెట్లో వేశాడని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఆ తర్వాత బకెట్లో వాటర్ హీటర్ పెట్టాడు.. ఆ తర్వాత శరీర భాగాలను అందులో వేసి ఉడికించాడు.. ఆ తర్వాత బకెట్లోంచి ఆ భాగాలను తీసి స్టవ్ పై ఉంచాడన్నారు. అనంతరం ఎముకలను రోటిలో దంచి పౌడర్ చేశాడు.. ఆ పౌడర్ను బాత్రూంలోకి వెళ్లి అనేక సార్లు ఫ్లెష్ చేశాడు.. మరికొన్ని చిన్నచిన్న ఎముకలను డస్ట్ బిన్ లో ఉంచాడని సీపీ వెల్లడించారు. నిందితుడు గురుమూర్తి కిచెన్ డోర్, ఇంట్లో, కిటికీలు తలుపులు తెరిచి ఉంచే ఇదంతా చేశాడని అన్నారు. సుమారు 8 గంటల పాటు బాడీని మొత్తం ముక్కలుగా చేసి పౌడర్ గా చేశాడు.. డిటర్జెంతో పాటు ఫినాయిల్ ఉపయోగించి ఎవిడెన్స్ లేకుండా చేశాడని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.
Read Also: KTR: మహాత్మా గాంధీ యూనివర్సిటీకి కేటీఆర్.. విద్యార్థులు వినతి పత్రం
ఈ ఘటనలో మొత్తం 16 వస్తువులను సీజ్ చేశామని రాచకొండ సీపీ చెప్పారు. గురుమూర్తికి ఏ మాత్రం పశ్చాత్తాపం లేదని సీపీ తెలిపారు. నరరూప రాక్షసుడిలా ప్రవర్తించాడు.. ప్రకాశం జిల్లాకి చెందిన గురుమూర్తి.. వెంకట మాధవి జిల్లెలగూడలో ఉంటున్నారని అన్నారు. భార్యను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే.. ముందస్తుగా తన ఇద్దరు పిల్లలను బంధువుల ఇంట్లో ఉంచి వచ్చాడని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగానే భార్య మాధవి తో గొడవ పెట్టుకున్నాడు.. వెంకట మాధవిని కొట్టాడు.. గోడకు వేసి అదిమాడు.. మాధవి పైన కూర్చుని గొంతు నులిమాడు.. ఊపిరి ఆగిపోయేంత వరకు గొంతు నులిమాడని సీపీ ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. మాధవిని హత్య చేసి బూడిద చేసి చెరువులో పారేసిన తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చాడని సీపీ చెప్పారు. పిల్లలకు తల్లిపై లేనిపోని మాటలు చెప్పాడు.. మీ మమ్మీ నాతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నమ్మించాడు.. అత్త, మామలకు కూడా ఇదే విషయం చెప్పాడన్నారు. గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు.. ఆధారాలు దొరికిన తర్వాత కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. మాధవిని పక్కా ప్రణాళిక ప్రకారం గురుమూర్తి హత్య చేశాడు.. క్షణికావేశంలో చేసిన హత్య కాదన్నారు. నిందితుడు గురుమూర్తిని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం.. ఇంకా ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుస్తాయని సీపీ చెప్పారు.
తాజావార్తలు
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!