PUBG Love Affair : ’55 ముక్కలుగా నరుకుతా”.. భర్తను బెదిరించిన ప్రేమలో మునిగిన భార్య
- PUBG ప్రేమ వ్యవహారం పెళ్లి జీవితాన్ని తలకిందలు చేసింది
- వెయ్యి కిలోమీటర్ల దూరం నుంచి లవర్ వచ్చాడు, భార్య భర్తను వదిలేసింది
- "55 ముక్కలుగా నరుకుతా".. భర్తను బెదిరించిన ప్రేమలో మునిగిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking : ఇది పబ్జీ ప్రేమ కథ కాదు.. పరస్పర నమ్మకాలను తాకే సోషల్ మీడియా రిలేషన్షిప్ హెచ్చరికగా మారిన ఘటన. ఉత్తరప్రదేశ్లోని మహోబాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ కోసం ఓ మహిళ తన కుటుంబాన్ని వదిలేసింది. మరోవైపు, ఆన్లైన్ పరిచయాన్ని నిజ జీవిత బంధంగా మలచేందుకు యువకుడు వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. బాంద్ జిల్లాకు చెందిన ఆరాధన అనే మహిళ 2022లో శీలు అనే యువకుడిని వివాహం చేసుకుంది. వీరికి ఏడాదిన్నర వయసున్న ఓ కుమారుడూ ఉన్నాడు. అయితే గేమింగ్కు ఆకర్షితురాలైన ఆరాధన, ఇంట్లో ఉండగానే PUBG గేమ్ ఆడటం ప్రారంభించింది. అదే సమయంలో లూధియానాకు చెందిన శివమ్ అనే వ్యక్తితో పబ్జీలో పరిచయం ఏర్పడింది. ఆటలో మొదలైన పరిచయం ప్రేమగా మారింది.
Jupally Krishan Rao : తలతిక్క పనులు చేశారు కాబట్టే బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించారు
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ఆరాధన తన భర్త చేత కొట్టించుకుంటానని శివమ్కు చెబుతూ ఉండేదట. దీన్ని గమనించిన శివమ్, ఆమె కోసం పంజాబ్ నుంచి మహోబా వరకు దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. ఊహించని అతిథిగా వచ్చిన అతడిని చూసి ఆరాధన భర్తతోపాటు కుటుంబం షాక్కు గురైంది. అతని రాకతో వారి ఇంట్లో గందరగోళం ఏర్పడింది. ఈ ప్రేమ కథలో మరొక ఘోర ట్విస్ట్ కూడా ఉంది. భర్త తమ ప్రేమకు అడ్డుగా నిలుస్తున్నాడని భావించిన ఆరాధన, అతడిని ‘మీరట్ మర్డర్’ తరహాలో 55 ముక్కలుగా నరుకుతానని బెదరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బెదిరింపుతో భయపడిన భర్త శివమ్ను పట్టించి పోలీసులకు అప్పగించాడు.
Prashant Kishor: హీటెక్కుతున్న బీహార్ పాలిటిక్స్.. రాహుల్గాంధీకి సవాల్ విసిరిన ప్రశాంత్ కిషోర్
శివమ్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా, ఆరాధన కూడా పోలీస్ స్టేషన్కు చేరుకుంది. తన భర్త తాగుబోతు, వేధింపుల వాడు అని ఆరోపిస్తూ… శివమ్తోనే వెళ్లిపోతానని వాదించింది. పోలీసులు కేసు నమోదు చేసి శివమ్ను 151 సెక్షన్ కింద కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటనతో, వాస్తవ ప్రపంచం ఎంత సంక్లిష్టంగా మారిందో స్పష్టమవుతోంది. టెక్నాలజీ పరిచయాల నేపధ్యంలో బంధాలు ఎలా రూపాంతరం చెందుతున్నాయన్నదానికి ఇది ఘాటు ఉదాహరణ.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!