PUBG Love Affair : ’55 ముక్కలుగా నరుకుతా”.. భర్తను బెదిరించిన ప్రేమలో మునిగిన భార్య
- PUBG ప్రేమ వ్యవహారం పెళ్లి జీవితాన్ని తలకిందలు చేసింది
- వెయ్యి కిలోమీటర్ల దూరం నుంచి లవర్ వచ్చాడు, భార్య భర్తను వదిలేసింది
- "55 ముక్కలుగా నరుకుతా".. భర్తను బెదిరించిన ప్రేమలో మునిగిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking : ఇది పబ్జీ ప్రేమ కథ కాదు.. పరస్పర నమ్మకాలను తాకే సోషల్ మీడియా రిలేషన్షిప్ హెచ్చరికగా మారిన ఘటన. ఉత్తరప్రదేశ్లోని మహోబాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ కోసం ఓ మహిళ తన కుటుంబాన్ని వదిలేసింది. మరోవైపు, ఆన్లైన్ పరిచయాన్ని నిజ జీవిత బంధంగా మలచేందుకు యువకుడు వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. బాంద్ జిల్లాకు చెందిన ఆరాధన అనే మహిళ 2022లో శీలు అనే యువకుడిని వివాహం చేసుకుంది. వీరికి ఏడాదిన్నర వయసున్న ఓ కుమారుడూ ఉన్నాడు. అయితే గేమింగ్కు ఆకర్షితురాలైన ఆరాధన, ఇంట్లో ఉండగానే PUBG గేమ్ ఆడటం ప్రారంభించింది. అదే సమయంలో లూధియానాకు చెందిన శివమ్ అనే వ్యక్తితో పబ్జీలో పరిచయం ఏర్పడింది. ఆటలో మొదలైన పరిచయం ప్రేమగా మారింది.
Jupally Krishan Rao : తలతిక్క పనులు చేశారు కాబట్టే బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించారు
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ఆరాధన తన భర్త చేత కొట్టించుకుంటానని శివమ్కు చెబుతూ ఉండేదట. దీన్ని గమనించిన శివమ్, ఆమె కోసం పంజాబ్ నుంచి మహోబా వరకు దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. ఊహించని అతిథిగా వచ్చిన అతడిని చూసి ఆరాధన భర్తతోపాటు కుటుంబం షాక్కు గురైంది. అతని రాకతో వారి ఇంట్లో గందరగోళం ఏర్పడింది. ఈ ప్రేమ కథలో మరొక ఘోర ట్విస్ట్ కూడా ఉంది. భర్త తమ ప్రేమకు అడ్డుగా నిలుస్తున్నాడని భావించిన ఆరాధన, అతడిని ‘మీరట్ మర్డర్’ తరహాలో 55 ముక్కలుగా నరుకుతానని బెదరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బెదిరింపుతో భయపడిన భర్త శివమ్ను పట్టించి పోలీసులకు అప్పగించాడు.
Prashant Kishor: హీటెక్కుతున్న బీహార్ పాలిటిక్స్.. రాహుల్గాంధీకి సవాల్ విసిరిన ప్రశాంత్ కిషోర్
శివమ్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా, ఆరాధన కూడా పోలీస్ స్టేషన్కు చేరుకుంది. తన భర్త తాగుబోతు, వేధింపుల వాడు అని ఆరోపిస్తూ… శివమ్తోనే వెళ్లిపోతానని వాదించింది. పోలీసులు కేసు నమోదు చేసి శివమ్ను 151 సెక్షన్ కింద కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటనతో, వాస్తవ ప్రపంచం ఎంత సంక్లిష్టంగా మారిందో స్పష్టమవుతోంది. టెక్నాలజీ పరిచయాల నేపధ్యంలో బంధాలు ఎలా రూపాంతరం చెందుతున్నాయన్నదానికి ఇది ఘాటు ఉదాహరణ.
తాజావార్తలు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..