Vani Jayaram: వాణీ జయరాం మృతిపై అనుమానాలు.. రంగంలోకి ఫోరెన్సిక్.. అసలు ఏం జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vani Jayaram: ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం కన్నుమూశారు.. అయితే, తన నివాసం విగత జీవిగా ఆమె పడి ఉన్న తీరు, ఆమె ముఖంపై గాయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. దీంతో, వాణీ జయరాం తూలిపడి మృతిచెందారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.. వాణీ జయరాం మృతిపై అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినా త్రిబుల్ కేన్ పోలీసులు.. ఆమె తలకు తీవ్రగాయం ఉండటంతో పని మనిషి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఇక, ఫోరెన్సిక్ నిపుణులను కూడా రంగంలోకి దించారు.. వాణీ జయరాం నివాసానికి చేరుకున్న ఫోరెన్సిక్ టీమ్.. అక్కడ ఆధారాలను సేకరించారు.. మరోవైపు.. వాణీ జయరాం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో.. ఒమేదురార్ ప్రభుత్వాస్పత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
Read Also: Vani Jayaram: వాణీ జయరామ్కు తెలుగువారితో ‘ఎన్నెన్నో జన్మలబంధం’
Also Read
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
అయితే, వాణీ జయరాం మృతి కేసులో ఏం జరిగిందనే విషయాల్లోకి వెళ్తే.. రోజూలానే ఆమె ఇంట్లో పని మనిషిగా చేస్తున్న మహిళ.. ఇవాళ కూడా వాణీ జయరాం నివాసానికి వెళ్లింది.. ఇంట్లోకి వెళ్లేందుకు కాలింగ్ బెల్ ప్రెస్ కొట్టింది.. అయితే, ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తీయకపోవడంతో.. ఆందోళనకు గురైన పనిమనిషి.. వాణీ జయరాం బంధువులకు సమాచారం చేరవేశారు.. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఇక, పోలీసులు వచ్చి డోర్ను బద్ధలు కొట్టి చూడగా ముఖంపై తీవ్ర గాయాలతో విగత జీవిగా వాణీజయరాం పడి ఉన్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.. మొత్తంగా పనిమనిషి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. వాణీ జయరాం భర్త జయరాం 2018లో కన్నుమూశారు.. వారికి పిల్లలు కూడా లేకపోవడంతో.. ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. వాణీజయరాం అసలు పేరు కలైవాణి.. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం.. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టిన వాణీ జయరాం.. 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం.. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, గుజరాతీ, ఒరియా సహా 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడి.. తనదైన ముద్రవేశారు.. మూడు సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా పురస్కారం అందుకున్న వాణీ జయరాం.. పాడిన తొలి పాటకే ఐదు అవార్డులు అందుకోవడం విశేషం.. ఇక, మొన్నటికిమొన్న కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును కూడా ప్రకటించింది.. కానీ, అమె పద్మా అవార్డును అందుకోకుండానే కన్నుమూశారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!