Vani Jayaram: వాణీ జయరాం మృతిపై అనుమానాలు.. రంగంలోకి ఫోరెన్సిక్.. అసలు ఏం జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vani Jayaram: ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం కన్నుమూశారు.. అయితే, తన నివాసం విగత జీవిగా ఆమె పడి ఉన్న తీరు, ఆమె ముఖంపై గాయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. దీంతో, వాణీ జయరాం తూలిపడి మృతిచెందారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.. వాణీ జయరాం మృతిపై అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినా త్రిబుల్ కేన్ పోలీసులు.. ఆమె తలకు తీవ్రగాయం ఉండటంతో పని మనిషి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఇక, ఫోరెన్సిక్ నిపుణులను కూడా రంగంలోకి దించారు.. వాణీ జయరాం నివాసానికి చేరుకున్న ఫోరెన్సిక్ టీమ్.. అక్కడ ఆధారాలను సేకరించారు.. మరోవైపు.. వాణీ జయరాం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో.. ఒమేదురార్ ప్రభుత్వాస్పత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
Read Also: Vani Jayaram: వాణీ జయరామ్కు తెలుగువారితో ‘ఎన్నెన్నో జన్మలబంధం’
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
అయితే, వాణీ జయరాం మృతి కేసులో ఏం జరిగిందనే విషయాల్లోకి వెళ్తే.. రోజూలానే ఆమె ఇంట్లో పని మనిషిగా చేస్తున్న మహిళ.. ఇవాళ కూడా వాణీ జయరాం నివాసానికి వెళ్లింది.. ఇంట్లోకి వెళ్లేందుకు కాలింగ్ బెల్ ప్రెస్ కొట్టింది.. అయితే, ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తీయకపోవడంతో.. ఆందోళనకు గురైన పనిమనిషి.. వాణీ జయరాం బంధువులకు సమాచారం చేరవేశారు.. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఇక, పోలీసులు వచ్చి డోర్ను బద్ధలు కొట్టి చూడగా ముఖంపై తీవ్ర గాయాలతో విగత జీవిగా వాణీజయరాం పడి ఉన్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.. మొత్తంగా పనిమనిషి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. వాణీ జయరాం భర్త జయరాం 2018లో కన్నుమూశారు.. వారికి పిల్లలు కూడా లేకపోవడంతో.. ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. వాణీజయరాం అసలు పేరు కలైవాణి.. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం.. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టిన వాణీ జయరాం.. 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం.. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, గుజరాతీ, ఒరియా సహా 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడి.. తనదైన ముద్రవేశారు.. మూడు సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా పురస్కారం అందుకున్న వాణీ జయరాం.. పాడిన తొలి పాటకే ఐదు అవార్డులు అందుకోవడం విశేషం.. ఇక, మొన్నటికిమొన్న కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును కూడా ప్రకటించింది.. కానీ, అమె పద్మా అవార్డును అందుకోకుండానే కన్నుమూశారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?