Tragedy : నమ్మి వెళ్తే నరికేశారు.. పరకాల హత్య కేసులో విస్తుపోయే నిజాలు.!
- వివాహేతర సంబంధమే హత్యకు కారణం
- భర్తపై రూ.5 లక్షల సుపారీ
- బీరు సీసాలతో దారుణ హత్య
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరకాల పట్టణంలోని సీఎస్ఐ కాలనీకి చెందిన మడికొండ సుమన్ (మెకానిక్), లావణ్య (మున్సిపల్ కార్మికురాలు) దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సుఖంగా సాగిపోతున్న వీరి సంసారంలోకి వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. లావణ్యకు స్థానికంగా ఉండే ఒక వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త సుమన్కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రియుడితో కలిసి ఉండటానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన లావణ్య, అతడిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం గోవిందరావుపేటకు చెందిన ఒక వ్యక్తితో రూ. 5 లక్షల సుపారీ ఒప్పందం కుదుర్చుకుంది.
Lenskart: బొట్టు-తిలకంపై నిషేధం, హిజాబ్కు అనుమతి.. టీసీఎస్ రచ్చ మధ్య లెన్స్కార్ట్ డ్రెస్కోడ్..
Also Read
- Dowry harassment: ప్రేమ పెళ్లి చేసుకున్న కట్నం వేధింపులు తప్పలేదు.. 2 నెలలకే నవవధువు మృతి..
- Gurugram: పెళ్లైన మూడు నెలలకే.. భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి..
- Delhi: పెళ్లైన రెండు నెలలకే నవవధువు మృతి.. మిస్టరీగా ఆకృతి మరణం..
- Wife Kills Husband: ‘‘ఇంట్లోకి రావొద్దు’’.. బాత్రూమ్ హత్య కేసులో సంచలన విషయాలు..
గతంలో రెండుసార్లు సుమన్ను చంపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, ఈసారి పక్కా ప్లాన్తో రంగంలోకి దిగింది. ఈ నెల 3వ తేదీన దంపతులిద్దరూ వరంగల్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు (ఏప్రిల్ 4) నుంచి సుమన్ కనిపించకుండా పోయాడు. లావణ్య తనకు ఏమీ తెలియనట్లు నటిస్తూ సుమన్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. బాధితుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పరకాల పోలీసులు, సుమన్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ములుగు జిల్లా గోవిందరావుపేట శివారులో సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించి అక్కడ గాలించగా, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న సుమన్ మృతదేహం లభ్యమైంది.
Delimitation Bill: మీ టికెట్లు అన్నీ ముస్లిం మహిళలకు ఇవ్వండి.. అఖిలేష్కు అమిత్ షా కౌంటర్..
సుమన్ను వరంగల్ నుండి గోవిందరావుపేట శివారుకు తీసుకెళ్లిన నిందితులు, అక్కడ అతడికి మద్యం తాగించి బీరు సీసాలతో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు శవంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. పోలీసుల విచారణలో లావణ్య తన నేరాన్ని అంగీకరించడంతో, ఆమెతో పాటు సుపారీ తీసుకున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!