Tragedy : నమ్మి వెళ్తే నరికేశారు.. పరకాల హత్య కేసులో విస్తుపోయే నిజాలు.!
- వివాహేతర సంబంధమే హత్యకు కారణం
- భర్తపై రూ.5 లక్షల సుపారీ
- బీరు సీసాలతో దారుణ హత్య
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరకాల పట్టణంలోని సీఎస్ఐ కాలనీకి చెందిన మడికొండ సుమన్ (మెకానిక్), లావణ్య (మున్సిపల్ కార్మికురాలు) దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సుఖంగా సాగిపోతున్న వీరి సంసారంలోకి వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. లావణ్యకు స్థానికంగా ఉండే ఒక వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త సుమన్కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రియుడితో కలిసి ఉండటానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన లావణ్య, అతడిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం గోవిందరావుపేటకు చెందిన ఒక వ్యక్తితో రూ. 5 లక్షల సుపారీ ఒప్పందం కుదుర్చుకుంది.
Lenskart: బొట్టు-తిలకంపై నిషేధం, హిజాబ్కు అనుమతి.. టీసీఎస్ రచ్చ మధ్య లెన్స్కార్ట్ డ్రెస్కోడ్..
Also Read
- Champapet Murder : అన్నదమ్ముల గొడవలో దారుణం.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు.!
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
గతంలో రెండుసార్లు సుమన్ను చంపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, ఈసారి పక్కా ప్లాన్తో రంగంలోకి దిగింది. ఈ నెల 3వ తేదీన దంపతులిద్దరూ వరంగల్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు (ఏప్రిల్ 4) నుంచి సుమన్ కనిపించకుండా పోయాడు. లావణ్య తనకు ఏమీ తెలియనట్లు నటిస్తూ సుమన్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. బాధితుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పరకాల పోలీసులు, సుమన్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ములుగు జిల్లా గోవిందరావుపేట శివారులో సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించి అక్కడ గాలించగా, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న సుమన్ మృతదేహం లభ్యమైంది.
Delimitation Bill: మీ టికెట్లు అన్నీ ముస్లిం మహిళలకు ఇవ్వండి.. అఖిలేష్కు అమిత్ షా కౌంటర్..
సుమన్ను వరంగల్ నుండి గోవిందరావుపేట శివారుకు తీసుకెళ్లిన నిందితులు, అక్కడ అతడికి మద్యం తాగించి బీరు సీసాలతో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు శవంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. పోలీసుల విచారణలో లావణ్య తన నేరాన్ని అంగీకరించడంతో, ఆమెతో పాటు సుపారీ తీసుకున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Heroines Exposing : పాన్ ఇండియా క్రేజ్ కోసం బోల్డ్ మేకోవర్లో హీరోయిన్లు
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Disney D23 2026: డిస్నీ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… రాబోయే మూడేళ్ల సినిమాల జాబితా ఇదే!
-
Vivo Y6k: వివో Y6k త్వరలో లాంచ్?.. Google Play Console లిస్టింగ్లో కీలక వివరాలు
-
Sunday Rasi Phalalu: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బు రాక మొదలు!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!