pistols and ganja seized: పిస్టళ్లు, రివాల్వర్లతో పట్టుబడ్డ స్మగ్లర్లు.. రూ.53 లక్షల గంజాయి సీజ్
- పాల్వంచలో గంజాయి ముఠా అరెస్ట్
- క్వింటాల్ వరకు గంజాయి స్వాధీనం
- 5 పిస్టళ్లు, ఒక రివాల్వర్, 40 బుల్లెట్స్
- 12 ఖాళీ మ్యాగజిన్స్ లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
pistols and ganja seized: గంజాయి స్మగ్లర్లు ఇప్పుడు వైల్డ్గా మారుతున్నారు. తమ దందాను అడ్డుకున్నా.. ఎవరైనా అడ్డు వచ్చినా.. అక్కడికక్కడే చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇందుకోసం ఏకంగా మారణాయుధాలు పెట్టుకుని మరీ దందా సాగిస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి కేరళకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకున్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఒకప్పుడు రెడ్ శాండిల్ స్మగ్లర్లు… పోలీసులు దాడి చేసే సమయంలో తమ దగ్గర ఉన్న గొడ్డళ్లు.. రాళ్లు ఆయుధాలుగా వాడేవారు. ఇప్పుడు కాల క్రమంలో పిస్టళ్లు, నాటు తుపాకులు సైతం ఉపయోగిస్తున్నారు. ఇక గంజాయి స్మగ్లర్లు సైతం.. అదే తరహాలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ రవాణా చేస్తున్న సమయంలో ఎవరైనా అడ్డం వస్తే చంపేయాలనే ప్లాన్తో వెళ్తున్నారు..
READ ALSO: Young Woman Suicide: పెళ్లి చేసుకుంటానన్నాడు.. అంతా బాగుంది అనుకునే టైమ్లో..
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
గంజాయి స్మగ్లర్లు ఇప్పుడు ఏకంగా తుపాకులే వెంట పెట్టుకుని తిరుగుతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి కేరళకు గంజాయి తీసుకు వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఓ ఐచర్ వ్యాను ద్వారా తరలిస్తున్న గంజాయి ముఠాను ఖమ్మం జిల్లా పాల్వంచలో పట్టుకున్నారు. ఆ ముఠా నుంచి క్వింటాల్ వరకు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ. 53 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు ఐతే వ్యాన్లో సోదాలు చేయగా.. 5 పిస్టళ్లు, ఒక రివాల్వర్, 40 బుల్లెట్స్తోపాటు 12 ఖాళీ మ్యాగజిన్స్ లభ్యమయ్యాయి..
బిలాల్పై ఇప్పటికే 100కు పైగా కేసులు
నిన్న మొన్నటి వరకు కత్తులను మారణాయుధాలుగా పెట్టుకుని గంజాయి స్మగ్లర్లు పట్టుబడే వారు. కానీ ఇప్పుడు ఏకంగా పిస్టళ్లు, రివాల్వర్లతో పట్టుబడడం సంచలనం రేపుతోంది. ఐతే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మారణాయుధాలు కొనుగోలు చేసి.. అటు నుంచి అటే ఒడిశాకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి కేరళకు వెళ్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో బిలాల్, శ్యామ్ సుందర్, కాశీనందన్, సంతోష్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుచ్చికి చెందిన జేమ్స్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే కేసులో పట్టుబడ్డ బిలాల్పై ఇప్పటికే 100కు పైగా కేసులు ఉన్నాయి. 28 సార్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన బిలాల్.. మళ్లీ నేరాలు చేస్తూనే ఉన్నాడు. అంతే కాదు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు. ఈ మధ్యే 8 ఏళ్లు జైలు శిక్ష పూర్తి చేసుకుని వచ్చాడంటున్నారు పోలీసులు. ఇక తమిళనాడుకు చెందిన శ్యామ్ సుందర్ గంజాయి వ్యాపారంలో అరితేరిన వ్యక్తిగా పేరుగాంచాడని చెబుతున్నారు.
READ ALSO: Chitradurga murder case: డెత్ మిస్టరీ.. చిత్రదుర్గ్లో గండికోట తరహా కేసు
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!