Unemployment: షాకింగ్.. నిరుద్యోగంతో 25 వేల మంది ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కో ఏడాది లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ పట్టాలు అందుకుంటున్నారు.. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. కొందరు తగిన ఉద్యోగం దొరకపోయినా.. ఎక్కడో తోచిన పని చేసుకుంటున్నారు.. కొందరికి అది కూడా సాధ్యం కావడం లేదు.. ఇక, నిరుద్యోగం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అన్ని పార్టీలు.. మేం అధికారంలోకి వస్తే.. లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తామిని హామీలు ఇవ్వడం మామూలే.. కానీ, వాళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్గా ఉంటుంది.. ఇక, ఉన్నత చదువులు చదినా ఉద్యోగం రాలేదన్న బాధతో కొందరు.. నిరుద్యోగం కారణంగా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను.. పైగానే నేనే వారికి భారంగా మారిపోయానని మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు.. మూడేళ్లలో 2018 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా ఏ కంగా 25,000 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Read Also: Bharti Airtel: వినియోగదారులకు మరో షాక్..!
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
రాజ్యసభలో ఈ అంశంపై ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) అందించిన డేటా ఆధారంగా ప్రభుత్వ గణాంకాలు ఉన్నాయన్న ఆయన.. మూడేళ్లలో (2018-2020) దేశంలో నిరుద్యోగం కారణంగా 25,000 మంది ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. ఇందులో ఉద్యోగం రాలేదని 9,140 మంది ఆత్మహత్య చేసుకోగా.. 16,091 మంది నిరుద్యోగం వల్ల తలెత్తిన ఆర్థిక సమస్యలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.. కాగా, గత కొన్ని వారాలుగా నిరుద్యోగ సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంచి రోజులు అంతంతమాత్రంగా ఉన్నాయని చెప్పడానికి ఒక సర్వేను కూడా ఉదహరించారు.. డేటా ప్రకారం 2020లో నిరుద్యోగులలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.. అత్యధికంగా 3,548 మంది ఒకే ఏడాది ప్రాణాలు తీసుకున్నారు.. ఇక, 2018లో 2,741 మంది నిరుద్యోగం కారణంగా జీవితాన్ని ముగించగా, 2019లో 2,851 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.. 2018లో 4,970 మంది దివాలా తీయడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని, 2019లో ఆ సంఖ్య 5,908కి పెరిగిందని, 2020లో 600 మరణాలు తగ్గి 5,213కి చేరుకున్నాయని వెల్లడించారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్.. ఇక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించి ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం చూస్తోందన్న ఆయన.. మానసిక రుగ్మతల భారాన్ని పరిష్కరించడానికి, ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని (NMHP) అమలు చేస్తోందన్నారు..
తాజావార్తలు
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!