AP Crime: చెల్లి పేరుతో ఎఫ్బీ ఖాతా తెరిచింది.. యువకుడి నుంచి కోట్లు వసూలు.. ట్విస్ట్ ఏంటంటే..?
- చెల్లి ఫొటో పెట్టి ఫేస్ బుక్ ఖాతా తెరిచిన అక్క..
- పరిచయం పెంచుకుని ఓ యువకుడి నుంచి డబ్బులు వసూలు..
- పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: సోషల్ మీడియా వేదికగా ఎన్నో మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. మనకు తెలిసి వ్యక్తి.. సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టినా? అది అసలు ఖాతానేనా..? ఇంకా ఎవరైనా ఆ పేరుతో ఖాతా ఓపెన్ చేశారా? అనేది కూడా తెలియని పరిస్థితి.. ఇప్పుడిదంతా ఎందుకంటే.. చెల్లి పేరుతో ఫేస్బుక్ ఖాతాను ఓపెన్ చేసిన ఓ అక్క.. ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది.. అంతేకాదు.. అతడి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది.. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో.. ఆత్మహత్యాయత్నం చేసింది..
Read Also: Free Ration : పేదలకు ఉచిత రేషన్ అందడం లేదు.. ఏటా రూ.69000 కోట్ల విలువైన ధాన్యాలు మాయం
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లావణ్య అనే మహిళ తాజాగా ఆత్మహత్యాయత్నం చేసింది.. దీంతో.. ఆమెను పత్తికొండ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. అయితే, హైదరాబాద్ కు చెందిన సాయిలు అనే వ్యక్తి నుంచి కోటి 20 లక్షల రూపాయలు లావణ్య కాజేసినట్లు ఆరోపణలున్నాయి. ఫేస్ బుక్ లో తన చెల్లెలు ప్రియాంక ఫోటోతో అకౌంట్ క్రియేట్ చేసిన లావణ్య.. ఆ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా హైదరాబాద్కు చెందిన సాయిలుతో పరిచయం పెంచుకుంది.. ఫేస్బుక్ పరిచయం కాస్తా.. చాటింగ్.. ఆ తర్వాత నంబర్ల షేరింగ్.. వాట్సాప్ చాటింగ్.. ఫోన్ సంభాణ వరకు వెళ్లింది.. ప్రియాంక మాట్లాడుతున్నట్టు సాయిలుతో మాట్లాడిన లావణ్య.. అతనికి వివిధ కారణాలు చెబుతూ.. క్రమంగా డబ్బులు వసూలుచేయడం మొదలు పెట్టింది. ఫేస్ బుక్ పరిచయంతోనే ఏకంగా రూ. కోటి 20 లక్షలు సాయిలు నుంచి లావణ్య వసూలు చేసింది. అయితే, తనకు న్యాయం చేయాలంటూ పత్తికొండ పీఎస్ ను బాధితుడు సాయిలు ఆశ్రయించాడు. రెండు రోజులుగా పీఎస్ లో పంచాయితీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో లావణ్య ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది.. అయితే, బాధితుడు సాయిలును బెదిరించేందుకు లావణ్య ఆత్మహత్యాత్నం చేసిందని స్థానికులు అంటున్నారు.. ఏదేమైనా జాగ్రత్త గురూ.. సోషల్ మీడియాలో అసలు ఎవరో.. ఫేక్ ఎవరో తెలుసుకొని మసులుకో..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!