AP Crime: చెల్లి పేరుతో ఎఫ్బీ ఖాతా తెరిచింది.. యువకుడి నుంచి కోట్లు వసూలు.. ట్విస్ట్ ఏంటంటే..?
- చెల్లి ఫొటో పెట్టి ఫేస్ బుక్ ఖాతా తెరిచిన అక్క..
- పరిచయం పెంచుకుని ఓ యువకుడి నుంచి డబ్బులు వసూలు..
- పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: సోషల్ మీడియా వేదికగా ఎన్నో మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. మనకు తెలిసి వ్యక్తి.. సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టినా? అది అసలు ఖాతానేనా..? ఇంకా ఎవరైనా ఆ పేరుతో ఖాతా ఓపెన్ చేశారా? అనేది కూడా తెలియని పరిస్థితి.. ఇప్పుడిదంతా ఎందుకంటే.. చెల్లి పేరుతో ఫేస్బుక్ ఖాతాను ఓపెన్ చేసిన ఓ అక్క.. ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది.. అంతేకాదు.. అతడి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది.. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో.. ఆత్మహత్యాయత్నం చేసింది..
Read Also: Free Ration : పేదలకు ఉచిత రేషన్ అందడం లేదు.. ఏటా రూ.69000 కోట్ల విలువైన ధాన్యాలు మాయం
Also Read
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లావణ్య అనే మహిళ తాజాగా ఆత్మహత్యాయత్నం చేసింది.. దీంతో.. ఆమెను పత్తికొండ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. అయితే, హైదరాబాద్ కు చెందిన సాయిలు అనే వ్యక్తి నుంచి కోటి 20 లక్షల రూపాయలు లావణ్య కాజేసినట్లు ఆరోపణలున్నాయి. ఫేస్ బుక్ లో తన చెల్లెలు ప్రియాంక ఫోటోతో అకౌంట్ క్రియేట్ చేసిన లావణ్య.. ఆ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా హైదరాబాద్కు చెందిన సాయిలుతో పరిచయం పెంచుకుంది.. ఫేస్బుక్ పరిచయం కాస్తా.. చాటింగ్.. ఆ తర్వాత నంబర్ల షేరింగ్.. వాట్సాప్ చాటింగ్.. ఫోన్ సంభాణ వరకు వెళ్లింది.. ప్రియాంక మాట్లాడుతున్నట్టు సాయిలుతో మాట్లాడిన లావణ్య.. అతనికి వివిధ కారణాలు చెబుతూ.. క్రమంగా డబ్బులు వసూలుచేయడం మొదలు పెట్టింది. ఫేస్ బుక్ పరిచయంతోనే ఏకంగా రూ. కోటి 20 లక్షలు సాయిలు నుంచి లావణ్య వసూలు చేసింది. అయితే, తనకు న్యాయం చేయాలంటూ పత్తికొండ పీఎస్ ను బాధితుడు సాయిలు ఆశ్రయించాడు. రెండు రోజులుగా పీఎస్ లో పంచాయితీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో లావణ్య ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది.. అయితే, బాధితుడు సాయిలును బెదిరించేందుకు లావణ్య ఆత్మహత్యాత్నం చేసిందని స్థానికులు అంటున్నారు.. ఏదేమైనా జాగ్రత్త గురూ.. సోషల్ మీడియాలో అసలు ఎవరో.. ఫేక్ ఎవరో తెలుసుకొని మసులుకో..
తాజావార్తలు
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!