NRI loses Rs 4 crores: రూ.4 కోట్లు క్రిప్టో కరెన్సీ మోసపోయిన ఎన్నారై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోసాలు చేసేవారికి దేశంలో వున్నవారైనా ఒక్కరే.. విదేశం నుంచి స్వదేశానికి వచ్చినవారైనా ఒకటే. అమెరికా నుంచి హైదరాబాద్ కి వచ్చేలోగా నాలుగు కోట్ల రూపాయల క్రిప్టో కరెన్సీ సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు. విమానంలో ఉండగానే నాలుగు కోట్ల రూపాయల కరెన్సీ లాగేశారు. అమెరికాలో నివసిస్తున్న హైదరాబాద్ వాసి లబోదిబో మంటూ సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించడంతో ఈమోసం బయటపడింది. అమెరికాలో సెటిల్ అయి.. ఇటీవల కాలంలో క్రిప్ట్ కరెన్సీలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మాడో శ్రీనివాస్ అనే ఎన్నారై. తన సంపాదన మొత్తాన్ని పెట్టి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల వరకు క్రిప్టో కరెన్సీగా మార్చాడు.
సింగపూర్ కు చెందిన బి బ్యాక్స్ అనే బ్యాంకు లావాదేవీలతో నిర్వహించాడు. తన తల్లి ఆరోగ్యం పాడవడంతో చికిత్స కోసం హైదరాబాద్ వచ్చాడు. ఫ్లైట్ లో ఉండి ఇండియాలో దిగేటప్పటికే అతనికి చెందిన క్రిప్టో కరెన్సీ మాయమైపోయింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తనకు తెలియకుండా తన దగ్గర ఉన్న క్రిప్ట్ మొత్తాన్ని బ్యాంకు అమ్మి వేసిందంటూ ఆరోపణ చేశాడు. తాను విమానంలో ఉన్న సమయంలోనే ఈ లావాదేవీలు జరిగిపోయాయని లబోదిబోమంటూ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అమెరికాలో స్థిరపడ్డ శ్రీనివాస్ రూ.6 లక్షల యూఎస్డీటీ(భారతీయ కరెన్సీలో సుమరు రూ.4 కోట్లు) పొగొట్టుకున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రిప్టో కరెన్సీని దాచే సింగపూర్కు చెందిన బీబాక్స్ బ్యాంకులో శ్రీనివాస్కు ఖాతా ఉంది. అందులో రూ.3 లక్షల యూఎస్డీటీ విలువ చేసే క్రిప్టో ఉంది.
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
ఇండియాకు వచ్చిన తరువాత ఆయన బీబాక్స్ ఖాతా హ్యాక్ అయింది. బాధితుడి వద్ద హైసెక్యూరిటీ ఉన్న ఐ-ఫోన్ ఉంది. తన ఖాతా నిజంగానే హ్యాక్ అయితే ఓటీపీలు, ఎస్ఎంఎస్లు రావాల్సి ఉన్నా రాలేదు. మెయిల్ ఐడీ హ్యాక్ కాలేదు. కాబట్టి బీబాక్స్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ వారి పొరపాటుతోనో, లేదా అక్కడి అధికారులు, సిబ్బంది ఎవరైనా ఇది చేసి ఉండవచ్చని బాధితుడు పోలీసుల ముందు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, తన ఖాతా హ్యాక్ ఎలా అయింది, ఎవరు యాక్సిస్ చేశారో వివరాలు ఇవ్వాలని జూన్ నుంచి బీబాక్స్ క్రిప్టో ఎక్సేంజ్ వారిని సంప్రదిస్తూనే ఉన్నా..ఎలాంటి స్పందన లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సింగపూర్లోని బీబాక్స్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ అసలేం జరిగిందో పూర్తి వివరాలివ్వాలని నోటీసులు పంపారు. మరి ఆ బ్యాంకు వారు ఏం బదులిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?