NRI loses Rs 4 crores: రూ.4 కోట్లు క్రిప్టో కరెన్సీ మోసపోయిన ఎన్నారై
మోసాలు చేసేవారికి దేశంలో వున్నవారైనా ఒక్కరే.. విదేశం నుంచి స్వదేశానికి వచ్చినవారైనా ఒకటే. అమెరికా నుంచి హైదరాబాద్ కి వచ్చేలోగా నాలుగు కోట్ల రూపాయల క్రిప్టో కరెన్సీ సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు. విమానంలో ఉండగానే నాలుగు కోట్ల రూపాయల కరెన్సీ లాగేశారు. అమెరికాలో నివసిస్తున్న హైదరాబాద్ వాసి లబోదిబో మంటూ సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించడంతో ఈమోసం బయటపడింది. అమెరికాలో సెటిల్ అయి.. ఇటీవల కాలంలో క్రిప్ట్ కరెన్సీలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మాడో శ్రీనివాస్ అనే ఎన్నారై. తన సంపాదన మొత్తాన్ని పెట్టి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల వరకు క్రిప్టో కరెన్సీగా మార్చాడు.
సింగపూర్ కు చెందిన బి బ్యాక్స్ అనే బ్యాంకు లావాదేవీలతో నిర్వహించాడు. తన తల్లి ఆరోగ్యం పాడవడంతో చికిత్స కోసం హైదరాబాద్ వచ్చాడు. ఫ్లైట్ లో ఉండి ఇండియాలో దిగేటప్పటికే అతనికి చెందిన క్రిప్టో కరెన్సీ మాయమైపోయింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తనకు తెలియకుండా తన దగ్గర ఉన్న క్రిప్ట్ మొత్తాన్ని బ్యాంకు అమ్మి వేసిందంటూ ఆరోపణ చేశాడు. తాను విమానంలో ఉన్న సమయంలోనే ఈ లావాదేవీలు జరిగిపోయాయని లబోదిబోమంటూ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అమెరికాలో స్థిరపడ్డ శ్రీనివాస్ రూ.6 లక్షల యూఎస్డీటీ(భారతీయ కరెన్సీలో సుమరు రూ.4 కోట్లు) పొగొట్టుకున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రిప్టో కరెన్సీని దాచే సింగపూర్కు చెందిన బీబాక్స్ బ్యాంకులో శ్రీనివాస్కు ఖాతా ఉంది. అందులో రూ.3 లక్షల యూఎస్డీటీ విలువ చేసే క్రిప్టో ఉంది.
Also Read
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
- Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
ఇండియాకు వచ్చిన తరువాత ఆయన బీబాక్స్ ఖాతా హ్యాక్ అయింది. బాధితుడి వద్ద హైసెక్యూరిటీ ఉన్న ఐ-ఫోన్ ఉంది. తన ఖాతా నిజంగానే హ్యాక్ అయితే ఓటీపీలు, ఎస్ఎంఎస్లు రావాల్సి ఉన్నా రాలేదు. మెయిల్ ఐడీ హ్యాక్ కాలేదు. కాబట్టి బీబాక్స్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ వారి పొరపాటుతోనో, లేదా అక్కడి అధికారులు, సిబ్బంది ఎవరైనా ఇది చేసి ఉండవచ్చని బాధితుడు పోలీసుల ముందు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, తన ఖాతా హ్యాక్ ఎలా అయింది, ఎవరు యాక్సిస్ చేశారో వివరాలు ఇవ్వాలని జూన్ నుంచి బీబాక్స్ క్రిప్టో ఎక్సేంజ్ వారిని సంప్రదిస్తూనే ఉన్నా..ఎలాంటి స్పందన లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సింగపూర్లోని బీబాక్స్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ అసలేం జరిగిందో పూర్తి వివరాలివ్వాలని నోటీసులు పంపారు. మరి ఆ బ్యాంకు వారు ఏం బదులిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!