Nellore Murder: ప్రియుడితో ఎంజాయ్ చేయొద్దన్నందుకు.. యమపురి పంపేసింది! మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore Murder: వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. క్షణికావేశంలో నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. వివాహేతర సంబంధం కొనసాగించవద్దని చెప్పినందుకు నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి బలయ్యాడు. సహజీవనం చేస్తున్న మహిళతోపాటు.. ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి చెరువులో పడేశారు. నెల్లూరు జిల్లాలో సంచలనం కలిగించిన సైదాపురం హత్య కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని ధ్రువీకరించారు. సైదాపురం మండలం ఆదురుపల్లి గ్రామ సమీపంలో ఉన్న నిమ్మ తోటలో ముగ్గురు గిరిజనులు నివాసం ఉంటున్నారు. అక్కడ నివాసం ఉంటూ నిమ్మ తోటకు కాపలా ఉండేవారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యంతో లక్ష్మమ్మ రెండేళ్ల నుంచి సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె అక్కడే నివాసం ఉంటున్న మస్తానయ్యతో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండేది. ఇది తెలుసుకున్న సుబ్రహ్మణ్యం ఆమెతో గొడవ పడేవాడు.
READ ALSO: Notice to Haleem Stalls: హలీమ్ స్టాల్స్కు అధికారుల నోటీసులు.. ఉదయం వరకు తొలగించాల్సిందే..!
Also Read
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
మస్తానయ్యతో సంబంధాన్ని కొనసాగించొద్దంటూ పలుమార్లు ఆమెతో గొడవపడ్డాడు. ఇదే సమయంలో మస్తానయ్యతో కూడా గొడవ పడడంతో.. అతను సుబ్రహ్మణ్యంపై దాడి చేశాడు. కర్రతో తల పైన బలంగా కొట్టడంతో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లక్ష్మమ్మతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మస్తానయ్య, మరో వ్యక్తి బాణాల మస్తానయ్య, లక్ష్మమ్మ కలిసి ఈ హత్య చేశారు. అయితే మృతదేహాన్ని ఎక్కడ పడేయాలో తెలియక నిమ్మ తోటను లీజుకు తీసుకున్న శ్రీనివాసులను ఆశ్రయించారు. దీంతో శ్రీనివాసులు జోక్యం చేసుకుని మృతదేహానికి కాళ్లు చేతులు కట్టి.. గోనె సంచిలో పెట్టారు. ఆ గోనె సంచికి పెద్ద బండరాయి కట్టి సమీపంలో ఉండే చెరువులో పడేశారు.
దాదాపు వారం పాటు మృతదేహం చెరువులోనే ఉండిపోయింది. సుబ్రహ్మణ్యం చెల్లి మౌనికకు అనుమానం వచ్చి తన అన్న కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో చెరువులో నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలో దిగిన పోలీసులు కేసుని ఛేదించారు. సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన మస్తానయ్య, మరో వ్యక్తి బాణాల మస్తానయ్య, లక్ష్మమ్మతో పాటు.. మృతదేహాన్ని బయటపడేసేందుకు సహకరించిన శ్రీనివాసులుని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. మొత్తంగా వివాహేతర బంధం.. ఆ తర్వాత జరిగిన గొడవల ద్వారా సుబ్రహ్మణ్యం ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు.
READ ALSO: Healthy Food: బాలింతలకు వరం.. పసిపాపలకు బలం.. ‘బీరకాయ తెలగపిండి కూర’!
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..