Nellore Murder: ప్రియుడితో ఎంజాయ్ చేయొద్దన్నందుకు.. యమపురి పంపేసింది! మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు..
Nellore Murder: వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. క్షణికావేశంలో నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. వివాహేతర సంబంధం కొనసాగించవద్దని చెప్పినందుకు నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి బలయ్యాడు. సహజీవనం చేస్తున్న మహిళతోపాటు.. ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి చెరువులో పడేశారు. నెల్లూరు జిల్లాలో సంచలనం కలిగించిన సైదాపురం హత్య కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని ధ్రువీకరించారు. సైదాపురం మండలం ఆదురుపల్లి గ్రామ సమీపంలో ఉన్న నిమ్మ తోటలో ముగ్గురు గిరిజనులు నివాసం ఉంటున్నారు. అక్కడ నివాసం ఉంటూ నిమ్మ తోటకు కాపలా ఉండేవారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యంతో లక్ష్మమ్మ రెండేళ్ల నుంచి సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె అక్కడే నివాసం ఉంటున్న మస్తానయ్యతో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండేది. ఇది తెలుసుకున్న సుబ్రహ్మణ్యం ఆమెతో గొడవ పడేవాడు.
READ ALSO: Notice to Haleem Stalls: హలీమ్ స్టాల్స్కు అధికారుల నోటీసులు.. ఉదయం వరకు తొలగించాల్సిందే..!
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
మస్తానయ్యతో సంబంధాన్ని కొనసాగించొద్దంటూ పలుమార్లు ఆమెతో గొడవపడ్డాడు. ఇదే సమయంలో మస్తానయ్యతో కూడా గొడవ పడడంతో.. అతను సుబ్రహ్మణ్యంపై దాడి చేశాడు. కర్రతో తల పైన బలంగా కొట్టడంతో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లక్ష్మమ్మతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మస్తానయ్య, మరో వ్యక్తి బాణాల మస్తానయ్య, లక్ష్మమ్మ కలిసి ఈ హత్య చేశారు. అయితే మృతదేహాన్ని ఎక్కడ పడేయాలో తెలియక నిమ్మ తోటను లీజుకు తీసుకున్న శ్రీనివాసులను ఆశ్రయించారు. దీంతో శ్రీనివాసులు జోక్యం చేసుకుని మృతదేహానికి కాళ్లు చేతులు కట్టి.. గోనె సంచిలో పెట్టారు. ఆ గోనె సంచికి పెద్ద బండరాయి కట్టి సమీపంలో ఉండే చెరువులో పడేశారు.
దాదాపు వారం పాటు మృతదేహం చెరువులోనే ఉండిపోయింది. సుబ్రహ్మణ్యం చెల్లి మౌనికకు అనుమానం వచ్చి తన అన్న కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో చెరువులో నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలో దిగిన పోలీసులు కేసుని ఛేదించారు. సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన మస్తానయ్య, మరో వ్యక్తి బాణాల మస్తానయ్య, లక్ష్మమ్మతో పాటు.. మృతదేహాన్ని బయటపడేసేందుకు సహకరించిన శ్రీనివాసులుని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. మొత్తంగా వివాహేతర బంధం.. ఆ తర్వాత జరిగిన గొడవల ద్వారా సుబ్రహ్మణ్యం ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు.
READ ALSO: Healthy Food: బాలింతలకు వరం.. పసిపాపలకు బలం.. ‘బీరకాయ తెలగపిండి కూర’!
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో