Nellore M*urder: కడుపులో, గొంతుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచి భార్యను హతమార్చిన భర్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore M*urder: భార్య ప్రవర్తనతో అతను విసిగిపోయాడు.. పద్ధతి మార్చుకోవాలంటూ పదేపదే ఆమెకు చెప్పాడు.. కానీ ఆమె వినలేదు.. దీంతో ఆమెకు దూరంగా ఉంటూ వచ్చిన భర్త.. చివరకు ఆమెను అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు.. ఈ ఘటన నెల్లూరులో సంచలనం కలిగించింది.
భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన నెల్లూరులోని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అయోధ్య నగర్లో జరిగింది. ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెంకి చెందిన నందినికి.. కోటమిట్టకు చెందిన శ్రీహరికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. శ్రీహరి నెల్లూరులోని ఓ ప్రైవేట్ బస్సు సర్వీస్లో సూపర్వైజర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐదేళ్లపాటు సజావుగా సాగిన వీరి కాపురంలో మనస్పర్ధలు నెలకొన్నాయి. నందిని మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడంతో దంపతుల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. దీంతో రోజూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి.
Also Read
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
Sun Massive Explosion : సూర్యుడిపై 17 భారీ పేలుళ్లు.. భూమికి పొంచి ఉన్న డేంజర్ ఇదే.!
శ్రీహరికి, నందినికి మధ్య గొడవలు రోజు జరుగుతూ ఉండడంతో.. తొమ్మిది నెలల నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. నందిని.. భర్తను, కుమార్తెను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకొని మధ్యలో ఆగిపోయారు. అప్పుడప్పుడు ఇద్దరూ ఫోన్ చేసి మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఆమెను ఎలాగైనా చంపేయాలని శ్రీహరి 3 నెలల కిందట నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి భార్యతో మాట్లాడుతూ.. ఆమె కదలికలను గమనించేవాడు.. నందినికి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆమె ఆక్కడికి వెళ్లిపోయింది. అక్కడి నుంచే శ్రీహరితో తరచూ మాట్లాడుతూ ఉండేది.
రెండు రోజుల క్రితం నెల్లూరుకు వస్తున్నట్లు శ్రీహరికి ఆమె ఫోన్ చేసి చెప్పింది. పికప్ చేసుకునేందుకు చింతా రెడ్డిపాలెం నేషనల్ హైవే వద్దకు రావాలని సూచించింది. దీంతో శ్రీహరి ఆమెను అంతమొందించేందుకు తన వెంట కత్తి తీసుకువెళ్లాడు. ఆమె బస్సు దిగగానే భార్యతో మాట్లాడుకుంటూ సమీపంలోని అయోధ్య నగర్ నాలుగో వీధిలోని ఖాళీ స్థలం వద్దకు వచ్చాడు. అక్కడ ఆమెతో గొడవపడ్డాడు. నందిని ఎదురు తిరగడంతో తన వద్దనున్న కత్తితో కడుపులో, గొంతుపై విచక్షణ రహితంగా పొడిచి ఆమెను హత్య చేసి పరారయ్యాడు.
Vivo X300 Ultra Leaks: 200MP+200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ఇండియన్ మార్కెట్ షేకే ఇగ!
సమాచారం తెలుసుకున్న బాలాజీ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిజిహెచ్ మార్చురీకి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న శ్రీహరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. తల్లి చనిపోవడం, తండ్రి జైలుకు పోవడంతో నాలుగేళ్ల చిన్నారి ఒంటరిగా మిగిలిపోయింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
-
Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..