Nellore M*urder: కడుపులో, గొంతుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచి భార్యను హతమార్చిన భర్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore M*urder: భార్య ప్రవర్తనతో అతను విసిగిపోయాడు.. పద్ధతి మార్చుకోవాలంటూ పదేపదే ఆమెకు చెప్పాడు.. కానీ ఆమె వినలేదు.. దీంతో ఆమెకు దూరంగా ఉంటూ వచ్చిన భర్త.. చివరకు ఆమెను అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు.. ఈ ఘటన నెల్లూరులో సంచలనం కలిగించింది.
భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన నెల్లూరులోని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అయోధ్య నగర్లో జరిగింది. ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెంకి చెందిన నందినికి.. కోటమిట్టకు చెందిన శ్రీహరికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. శ్రీహరి నెల్లూరులోని ఓ ప్రైవేట్ బస్సు సర్వీస్లో సూపర్వైజర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐదేళ్లపాటు సజావుగా సాగిన వీరి కాపురంలో మనస్పర్ధలు నెలకొన్నాయి. నందిని మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడంతో దంపతుల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. దీంతో రోజూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి.
Also Read
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
Sun Massive Explosion : సూర్యుడిపై 17 భారీ పేలుళ్లు.. భూమికి పొంచి ఉన్న డేంజర్ ఇదే.!
శ్రీహరికి, నందినికి మధ్య గొడవలు రోజు జరుగుతూ ఉండడంతో.. తొమ్మిది నెలల నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. నందిని.. భర్తను, కుమార్తెను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకొని మధ్యలో ఆగిపోయారు. అప్పుడప్పుడు ఇద్దరూ ఫోన్ చేసి మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఆమెను ఎలాగైనా చంపేయాలని శ్రీహరి 3 నెలల కిందట నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి భార్యతో మాట్లాడుతూ.. ఆమె కదలికలను గమనించేవాడు.. నందినికి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆమె ఆక్కడికి వెళ్లిపోయింది. అక్కడి నుంచే శ్రీహరితో తరచూ మాట్లాడుతూ ఉండేది.
రెండు రోజుల క్రితం నెల్లూరుకు వస్తున్నట్లు శ్రీహరికి ఆమె ఫోన్ చేసి చెప్పింది. పికప్ చేసుకునేందుకు చింతా రెడ్డిపాలెం నేషనల్ హైవే వద్దకు రావాలని సూచించింది. దీంతో శ్రీహరి ఆమెను అంతమొందించేందుకు తన వెంట కత్తి తీసుకువెళ్లాడు. ఆమె బస్సు దిగగానే భార్యతో మాట్లాడుకుంటూ సమీపంలోని అయోధ్య నగర్ నాలుగో వీధిలోని ఖాళీ స్థలం వద్దకు వచ్చాడు. అక్కడ ఆమెతో గొడవపడ్డాడు. నందిని ఎదురు తిరగడంతో తన వద్దనున్న కత్తితో కడుపులో, గొంతుపై విచక్షణ రహితంగా పొడిచి ఆమెను హత్య చేసి పరారయ్యాడు.
Vivo X300 Ultra Leaks: 200MP+200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ఇండియన్ మార్కెట్ షేకే ఇగ!
సమాచారం తెలుసుకున్న బాలాజీ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిజిహెచ్ మార్చురీకి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న శ్రీహరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. తల్లి చనిపోవడం, తండ్రి జైలుకు పోవడంతో నాలుగేళ్ల చిన్నారి ఒంటరిగా మిగిలిపోయింది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!