వారం రోజుల పసికందును అంత దారుణంగా ఎలా చేయగలిగావ్ తల్లీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజం మారుతోంది.. మహిళపై వివక్ష తగ్గుతోంది.. ఆడామగ ఇద్దరు సమానమే అనుకుంటున్నారు తల్లిదండ్రులు.. ఇక సమాజంలో స్త్రీల సంఖ్య పెరుగుతోంది అని ఆశించేలోపు ఎక్కడో ఒకచోట ఈ వివక్ష కనిపించడం బాధాకరమైన విషయం.. ఆడపిల్ల కడుపులో పెరుగుతోందని కడుపులోనే చంపేస్తున్నారు.. ఆడపిల్లలు పుట్టారని.. పుట్టినా వెంటనే గొంతు నులిమేస్తున్నారు.. తాజాగా ఒక తల్లి తనకు వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో.. మూడో బిడ్డను అతి కిరాతకంగా చంపిన దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. తాడికొండ మండలం రావెలకు చెందిన బొంతా లక్ష్మి కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది.. ఆమెకు ఇద్దరు కుమార్తెలు.. ఈసారి ఎలాగైనా మగబిడ్డకు జన్మనివ్వాలని మూడో కాన్పు కోసం గుంటూరు జీజీహెచ్ లో జాయిన్ అయ్యింది. డిసెంబర్ 2 న ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో రెండు రోజులకే ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే లక్ష్మీ మాత్రం ఆనందంగా లేదు.. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు.. మగబిడ్డకు ఎదురుచూస్తే మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టింది.. ఎందుకు ఈ ఆడ సంతానం అని కోపంతో రగిలిపోయి.. వారం రోజుల పసికందు అని కూడా చూడకుండా పసిగుడ్డు నోట్లో వేళ్లు పెట్టి ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేసింది. ఆ తరువాత ఏమి తెలియనట్లు బిడ్డ చనిపోయిందని తెలిపింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలుసుకున్న ఏఎన్ఏం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి లక్ష్మీని అరెస్ట్ చేశారు.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!