Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించాలి… కానీ ఆ దంపతులకు తీసుకోవడమే కానీ.. తిరిగి ఇవ్వడం అలవాటు లేదు.. అంతేకాదు.. అప్పు ఇచ్చిన వారు తిరిగి తమ డబ్బులు చెల్లించాలని అడిగితే వారికి చిర్రెత్తుకొస్తుంది. అలాంటి వారి అప్పు తీర్చడం కాదు.. కాదా ఏకంగా కాటికే పంపేస్తారు.. హత్య చేసి ఫామ్హౌజ్లో డెడ్బాడీలు పూడ్చి పెడతారు. మొయినాబాద్ ఫామ్హౌజ్ జంట హత్యల కేసులో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అంతే కాదు.. వారు మరో 8 మందిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారన్న విషయం బయటపడడంతో పోలీసులే షాకవుతున్నారు.
యస్.. మీరు విన్నది కరెక్టే. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వారు.. కేవలం తాము అప్పు ఇచ్చిన పాపానికి బలైపోయారు. ఈ ఫోటోలో ఉన్న మహిళల పేర్లు మహబూబ్ బీ, అబిదా బేగం. తాండూరు ప్రాంతానికి చెందిన వీరిద్దరూ ఏప్రిల్ 27న ఒకరు.. మే9న మరొకరు అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు చాలా చోట్ల వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బషీరాబాద్ పోలీసులు.. దర్యాప్తు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే మొయినాబాద్లోని ఓ ఫామ్హౌజ్లో ఇద్దరూ శవాలుగా తేలారు.
Also Read
- Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
దీంతో ఈ కేసులో మిస్సింగ్ అంశం కాస్తా మర్డర్ కేసుగా మారింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వారే ఆ నిందితులు. ఇందులో ప్రధాన నిందితురాలు కరీమాబీ. ఆమె పక్కనే ఉన్న వ్యక్తి ఆమె భర్త.. మరో వ్యక్తి వారిద్దరికీ సహాయం చేసిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కరీమాబీ దంపతులు పలువురి వద్ద అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా జల్సాలు చేయడం అలవాటు చేసుకున్నారు. డబ్బులు అడిగిన వారిని మోసం చేసి ఫామ్ హౌస్కు పిలిపించి, రాత్రివేళల్లో దాడి చేసి హత్యలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటికే 8 మంది రుణదాతలను హత్య చేయాలని పథకం వేసినట్లు సమాచారం. అందులో భాగంగా మహబూబ్ బీ, అబిదా బేగంను చంపేశారు.
డబ్బులు ఇస్తామని చెప్పి రుణదాతలను మొయినాబాద్ ప్రాంతంలోని ఫామ్ హౌస్కు పిలిచేవారని పోలీసులు తెలిపారు. అక్కడ భోజనాలు పెట్టి రాత్రి వరకు ఉండాలని చెప్పి, వారు నిద్రలో ఉన్న సమయంలో దాడి చేసి హత్య చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. హత్య అనంతరం మృతదేహాలను ఎవరికి తెలియకుండా ఫామ్ హౌస్ సమీపంలో పూడ్చిపెట్టారని వెల్లడించారు.
దర్యాప్తులో అప్పుల లావాదేవీలపై అనుమానం వచ్చిన పోలీసులు నిందితులను విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఒత్తిడి తెచ్చినందుకు కోపంతో కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మొయినాబాద్ ప్రాంతంలో తవ్వకాలు నిర్వహించిన పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. సంఘటన స్థలంలో కీలక ఆధారాలు సేకరించారు.. అటు కరీమాబీ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఆరుగురు మహిళలు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. దీంతో మరికొంత మందిని కూడా హత్య చేయాలని పథకం వేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
-
Traffic Restrictions : రాజ్భవన్ ‘ఎట్ హోమ్’.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!