Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించాలి… కానీ ఆ దంపతులకు తీసుకోవడమే కానీ.. తిరిగి ఇవ్వడం అలవాటు లేదు.. అంతేకాదు.. అప్పు ఇచ్చిన వారు తిరిగి తమ డబ్బులు చెల్లించాలని అడిగితే వారికి చిర్రెత్తుకొస్తుంది. అలాంటి వారి అప్పు తీర్చడం కాదు.. కాదా ఏకంగా కాటికే పంపేస్తారు.. హత్య చేసి ఫామ్హౌజ్లో డెడ్బాడీలు పూడ్చి పెడతారు. మొయినాబాద్ ఫామ్హౌజ్ జంట హత్యల కేసులో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అంతే కాదు.. వారు మరో 8 మందిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారన్న విషయం బయటపడడంతో పోలీసులే షాకవుతున్నారు.
యస్.. మీరు విన్నది కరెక్టే. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వారు.. కేవలం తాము అప్పు ఇచ్చిన పాపానికి బలైపోయారు. ఈ ఫోటోలో ఉన్న మహిళల పేర్లు మహబూబ్ బీ, అబిదా బేగం. తాండూరు ప్రాంతానికి చెందిన వీరిద్దరూ ఏప్రిల్ 27న ఒకరు.. మే9న మరొకరు అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు చాలా చోట్ల వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బషీరాబాద్ పోలీసులు.. దర్యాప్తు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే మొయినాబాద్లోని ఓ ఫామ్హౌజ్లో ఇద్దరూ శవాలుగా తేలారు.
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
దీంతో ఈ కేసులో మిస్సింగ్ అంశం కాస్తా మర్డర్ కేసుగా మారింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వారే ఆ నిందితులు. ఇందులో ప్రధాన నిందితురాలు కరీమాబీ. ఆమె పక్కనే ఉన్న వ్యక్తి ఆమె భర్త.. మరో వ్యక్తి వారిద్దరికీ సహాయం చేసిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కరీమాబీ దంపతులు పలువురి వద్ద అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా జల్సాలు చేయడం అలవాటు చేసుకున్నారు. డబ్బులు అడిగిన వారిని మోసం చేసి ఫామ్ హౌస్కు పిలిపించి, రాత్రివేళల్లో దాడి చేసి హత్యలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటికే 8 మంది రుణదాతలను హత్య చేయాలని పథకం వేసినట్లు సమాచారం. అందులో భాగంగా మహబూబ్ బీ, అబిదా బేగంను చంపేశారు.
డబ్బులు ఇస్తామని చెప్పి రుణదాతలను మొయినాబాద్ ప్రాంతంలోని ఫామ్ హౌస్కు పిలిచేవారని పోలీసులు తెలిపారు. అక్కడ భోజనాలు పెట్టి రాత్రి వరకు ఉండాలని చెప్పి, వారు నిద్రలో ఉన్న సమయంలో దాడి చేసి హత్య చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. హత్య అనంతరం మృతదేహాలను ఎవరికి తెలియకుండా ఫామ్ హౌస్ సమీపంలో పూడ్చిపెట్టారని వెల్లడించారు.
దర్యాప్తులో అప్పుల లావాదేవీలపై అనుమానం వచ్చిన పోలీసులు నిందితులను విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఒత్తిడి తెచ్చినందుకు కోపంతో కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మొయినాబాద్ ప్రాంతంలో తవ్వకాలు నిర్వహించిన పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. సంఘటన స్థలంలో కీలక ఆధారాలు సేకరించారు.. అటు కరీమాబీ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఆరుగురు మహిళలు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. దీంతో మరికొంత మందిని కూడా హత్య చేయాలని పథకం వేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!