Extramarital Affair: ఎఫైర్ మోజులో భార్య.. మృత్యువాత పడ్డ భర్త.. కట్ చేస్తే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Married Woman Killed Husband For Extramarital Affair In Bangalore: కొందరు మహిళలు వివాహేతర సంబంధాల మోజులో పడి.. తమ పచ్చని కాపురాల్ని కూల్చుకుంటున్నారు. హంతకులుగా కూడా అవతారం ఎత్తుతున్నారు. జీవితాంతం తోడుంటానని ఏడడుగులు నడిచిన భార్యలే.. మరో వ్యక్తి కోసం తమ భర్తల్ని అంతమొందిస్తున్నారు. తాజాగా మరో మహిళ ఇలాంటి దారుణానికే ఒడిగట్టింది. తన సంతోషానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి భర్తని చంపింది. తను చేసిన నేరాన్ని కప్పిపుచ్చేందుకు.. ఏవేవో డ్రామాలు ఆడింది. చివరికి ఆమె ఆడిన నాటకాలన్నీ బెడిసికొట్టడంతో.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
రామనగర తాలూకా హోరోహళ్లిలో నివాసముంటున్న కిరణ్(27)కి కొన్నాళ్ల క్రితం ఓ మహిళతో వివాహమైంది. అయితే.. ఆమె యశ్వంత్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకి తెలియకుండా.. తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇంట్లో భర్త లేనప్పుడు.. తన ప్రియుడు యశ్వంత్ని ఇంటికి పిలిపించుకొని, తన మోజు తీర్చుకునేది. చివరికి ఒక రోజు తన భార్య గుట్టు కిరణ్కి తెలిసింది. ఈ నేపథ్యంలోనే అతడు నిలదీశాడు. మరోసారి ఆ వ్యక్తితో కలవొద్దని వారించాడు. భర్త ఉన్నంతవరకూ తన మోజు తీరదని అనుకున్న ఆమె.. ఎలాగైనా తన భర్తని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తన ప్రియుడు యశ్వంత్కి తెలియజేసింది. దీంతో వాళ్లిద్దరూ కిరణ్ని చంపాలని ఒక ప్లాన్ వేసుకున్నారు.
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
ఇటీవల కిరణ్ రాత్రి ఇంటికి చేరుకొని, భోజనం చేసిన తర్వాత పడుకున్నాడు. భర్త నిద్రలోకి జారుకున్నాక.. అతని భార్య యశ్వంత్ని ఇంటికి పిలిచింది. పథకం ప్రకారం.. కిరణ్ని చంపేసి, ఒక నిర్మానుష్య ప్రాంతానికి మృతదేహాన్ని తీసుకెళ్లి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి వచ్చేశారు. మరుసటి రోజు కిరణ్ శవం లభ్యం కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే వారు మృతుడు కిరణ్గా గుర్తించారు. అతని భార్యని పిలిపించి ప్రశ్నించారు. ఆమె పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో.. తమదైన శైలిలో పోలీసులు విచారించారు. దాంతో ఆమె నిజం కక్కేసింది. కిరణ్ భార్యని, యశ్వంత్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..