Extramarital Affair: నిద్రలో భర్త పోయాడు.. కూతురు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Married Woman Killed Her Husband With Help Of Lover In Yeswanthpur: వివాహేతర సంబంధాల మోజులో పడి జనాలు తమ సంసారాల్ని కూల్చుకుంటున్నారు. భాగస్వామ్యుల్ని చంపుకుంటున్నారు. ఆ తర్వాత జరిగే పర్యావసానాలు, కుటుంబ విలువల్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. అడ్డుగా ఉన్నారని.. ప్లాన్స్ వేసి మరీ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక వివాహిత సైతం అలాంటి దారుణానికే పాల్పడింది. తన ప్రియుడితో కలిసి జీవించడం కోసం, అత్యంత కిరాతకంగా భర్తను చంపేసింది. ఈ హత్యకేసు నుంచి తప్పించుకోవడం కోసం, ఒక డ్రామా కూడా నడిపించింది. కానీ.. కూతురు ఇచ్చిన ట్విస్ట్తో కటకటాలపాలైంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Encounter: జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
యశవంతపురలోని సంజయ్ నగరకు చెందిన ఆంజనేయ (45)కు చాలా సంవత్సరాల క్రితం అనిత అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కట్ చేస్తే.. ఒక గార్మెంట్స్ పరిశ్రమలో పని చేస్తున్న అనితకు, అక్కడ రాకేశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు తెలియకుండా అనిత తన ప్రియుడితో రాసలీలలు కొనసాగించింది. భర్త ఇంట్లో లేనప్పుడు.. రాకేశ్ని నేరుగా ఇంటికి పిలిపించుకునేది. అయితే.. ఓసారి ఆంజనేయ వీరిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అప్పుడు ఇద్దరికీ తగిన బుద్ధి చెప్పాడు. ఇలాంటి పాడు పనులు మానుకోవాలని భార్య అనితకు సూచించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. భర్త మాటని పట్టించుకోకుండా, రాకేశ్తో తన సంబంధాన్ని కొనసాగించింది. దీంతో.. కోపాద్రిక్తుడైన ఆంజనేయ, అనిత చేత పని మాన్పించి, ఇంట్లోనే ఉండమన్నాడు.
Man Frozen With Noodles: వేడివేడి నూడుల్స్ తినాలనుకున్నాడు.. గడ్డకట్టుకుపోయాడు
కానీ.. అనిత ఎక్కువ కాలం ఇంట్లోనే ఉండలేకపోయింది. రాకేశ్తోనే ఉండాలని నిర్ణయించుకుంది. అలా ఉండాలంటే, తన భర్త అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఇందుకు రాకేశ్, అనిత కలిసి ఒక ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం.. గతేడాది జూన్లో ఆంజనేయ ఇంట్లో నిద్రపోతున్నప్పుడు, అనిత తన ప్రియుడు రాకేశ్ని ఇంటికి పిలిపించింది. ఇద్దరు కలిసి ఆంజనేయుడిని గొంతు పిసికి చంపేశారు. అనంతరం తన భర్త గుండెపోటుతో మృతిచెందాడని అనిత నమ్మించింది. అయితే.. ఇటీవల అనిత కూతురు ‘తన అమ్మే నాన్నను చంపింది’ అని బంధువులతో తెలిపింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అనితని అదుపులోకి తీసుకుని విచారించగా.. అక్రమ సంబంధం విషయమై తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు నేరం ఒప్పుకుంది. దాంతో ఇద్దరినీ జైలుకు పంపారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!