Crime News: ఆమె రెండేళ్ళు పెద్దది.. పెళ్ళి కూడా అయింది.. చివరికి ప్రేమలో పడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతడు.. ఆమె.. చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకే ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆ ఇద్దరు.. కలిసి చదువుకోవడమే కాదు, ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు కూడా! స్నేహితులుగానే మెలుగుతూ వచ్చిన ఆ ఇద్దరి మధ్య ఎప్పుడు ప్రేమ చిగురించిందో తెలీదు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేరన్న సంగతి గ్రహించి.. తాము ప్రేమలో ఉన్నామని తెలుసుకున్నారు. అతడి కంటే ఆమె రెండేళ్ళు పెద్దది. అయినా, ప్రేమకి వయసుతో సంబంధం ఏముంది? అయితే.. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ అమ్మాయికి మరొకరితో వివాహం ఫిక్స్ అయ్యింది. తమ ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, వాళ్ళని కాదని పారిపోలేక.. ఇంట్లో వాళ్ళు చూసిన వ్యక్తినే పెళ్ళి చేసుకుంది.
అయినప్పటికీ ప్రియుడ్ని విడిచి ఉండలేకపోయింది. దీంతో, ఇద్దరు మళ్ళీ చాటుమాటుగా కలుసుకోవడం మొదలుపెట్టారు. భర్త, ఇంట్లో వాళ్ళకు తెలియకుండా, తమ ప్రేమ జీవితాన్ని తిరిగి గడపడం ప్రారంభించారు. అయితే.. ఎంతోకాలం ఈ విషయం దాగి ఉండలేదు. కుటుంబ సభ్యులకు వీరి వ్యవహారం తెలిసిపోయింది. ఫలితంగా.. ఎన్నో గొడవలు జరిగాయి. అప్పట్నుంచి దూరం పెరిగింది. ఆ దూరం వీరిని కలిచివేస్తూ వచ్చింది. ఇక జీవితాంతం ఇంతేనని, ఎప్పుడూ కలుసుకోలేమని తెలుసుకున్న ఈ ప్రేమ జంట.. కనీసం చావులోనైనా ఒకటౌదామని నిర్ణయించుకున్నారు. ఆ మరుక్షణమే ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్లలో చోటు చేసుకుంది.
Also Read
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
ఆ వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్ నగర్కు చెందిన వేణు గోపాల్(24), మచ్చ పూజ (26) స్థానికంగా గోపాల్ నగర్లోని ఓ ప్రైవేటు క్లినిక్ రిసెప్షన్లో పని చేస్తున్నారు. ఒకే ప్రాంతంలో పుట్టి, పెరిగిన ఈ ఇద్దరూ.. ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. కొన్నేళ్ళుగా వీళ్ళు ప్రేమలో ఉన్నారు. అయితే.. నాలుగేళ్ళ క్రితమే పూజ పెళ్ళి మేన బావ అజయ్తో చేశారు. కానీ.. ఆమె మాత్రం భర్తతో కాకుండా వేణు గోపాల్తో తరచు కలుస్తోంది. వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందన్న విషయం తెలియడంతో, కుటుంబ సభ్యుల మధ్య చాలా గొడవలు జరిగాయి. కట్ చేస్తే.. ఈ నెల 15 నుంచి పూజ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఆ ప్రేమ జంట ఓ చెట్టుకు ఉరేసుకొని, ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఐదు రోజుల క్రితం ఆ జంట ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని, మూడు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలోని ధర్మారం చౌరస్తాకు బైక్పై వచ్చారని విచారణలో తేలింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక ఇలా సూసైడ్ చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
తాజావార్తలు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..