Man Shoots Daughter: పెళ్లికి 4 రోజుల ముందు కూతురిని కాల్చి చంపిన తండ్రి.. కారణం ఏంటంటే..
- పెళ్లికి నాలుగు రోజుల ముందు కూతురు హత్య..
- వివాహానికి ఒప్పుకోకపోవడంతో తండ్రి చేతిలో హతమైన కూతురు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Shoots Daughter: పోలీసుల ముందే కూతురిని కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగింది. సదరు యువతి పెళ్లికి నాలుగు రోజుల ముందు తండ్రి చేతిలో హతమైంది. ఆమె హత్యకు కొన్ని గంటల ముందే పంచాయతీ కూడా జరిగింది. తండ్రి నిర్ణయించిన పెళ్లిని కాదని, కూతురు వేరే వ్యక్తిని విహాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతోనే ఈ హత్య జరిగింది. 20 ఏళ్ల యువతి తను గుర్జార్, తన కుటుంబం కుదిర్చిన పెళ్లిని వ్యతిరేకించింది. తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నగరంలోని గోలా కా మందిర్ ప్రాంతంలో ఈ హత్య జరిగింది. హత్యకు పాల్పడిన యువతి తండ్రిని మహేష్ గుర్జార్గా గుర్తించారు. అదే రోజు తనూ గుర్జార్ తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ వీడియోపై ఆగ్రహించిన తండ్రి, దేశీయంగా తయారు చేసిన తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. ఈ హత్యకు తను కజిన్ రాహుల్ కూడా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
Read Also: Tummala Nageswara Rao: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల సీరియస్..
ఆమె హత్యకు కొన్ని గంటల ముందు, తన కుటుంబ సభ్యులు తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ.. 52 సెకన్ల వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కుటుంబ సభ్యుల నుంచి తన ప్రాణానికి ప్రమాదం ఉందని పేర్కొంది. ‘‘నేను విక్కీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా కుటుంబం మొదట్లో అంగీకరించింది, ఆ తర్వాత నిరాకరించింది. వాళ్లు నన్ను రోజూ కొడుతూ, చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే, నా కుటుంబమే బాధ్యత వహిస్తుంది’’ అని పేర్కొంది.
విక్కీ అనే వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా నివాసితో, తనూ గుర్జార్ 6 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఎస్పీ ధర్మవీర్ సింగ్ నేతృత్వంలోని పోలీస్ అధికారులు ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు వారి ఇంటికి చేరుకున్నారు. విషయాన్ని పరిష్కరించడానికి కుల పంచాయతీ కూడా జరిగింది. ఈ సందర్భంలోనే తను గుర్జార్ ఇంట్లో ఉండేందుకు నిరాకరించి, ప్రభుత్వం నిర్వహించే వన్ స్టాప్ సెంటర్కి తీసుకెళ్లాలని అభ్యర్థించింది.
ఆ సమయంలోనే మహేష్ కూతురితో పర్సనల్గా మాట్లాడాలని కోరాడు. ఆమెను ఒప్పిస్తానని చెప్పాడు. ఇలా నమ్మించిన మహేష్ కూతురుని దేశవాళీ తుపాకీతో కాల్చి చంపాడు. అత్యంత దగ్గర నుంచి ఛాతీ, నుదిలిపై కాల్చడంతో అక్కడిక్కడే తనూ మరణించింది. మహేష్ బంధువులు, పోలీసులపై కూడా తుపాకీతో ఫైర్ చేస్తానని బెదిరించాడు. మహేష్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, హత్యకు సహకరించిన రాహుల్ పరారయ్యాడు. జనవరి 18న జరగాల్సిన తను వివాహానికి సన్నాహాలు జరుగుతుండగా ఈ హత్య జరిగింది.
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!