UP Crime: భూ వివాదంలో పొరుగువారిని ఇరికించేందుకు కూతురి హత్య..
- ఇరుగుపొరుగు వారితో భూవివాదం..
- వారిని ఇరికించేందుకు కన్న కూతురి హత్య..
- ఉత్తర్ ప్రదేశ్తో అమానుష ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Crime: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. భూ వివాదంలో ఇరుగుపొరుగు వారిని ఇరికించేందుకు ఓ తండ్రి కన్న కూతురినే హతమార్చాడు. ఈ ఘటన ఖుషినగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నలుగురు పిల్లల్లో చిన్నదైన కూతురు గొంతు కోసి హత్య చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. తన 16 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన దాదాపు రెండు వారాల తర్వాత మంగళవారం నిందితుడు జయనారాయణ్ సింగ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
నెబువా నౌరంగియా గ్రామంలో నవంబర్ 1వ తేదీ రాత్రి 10వ తరగతి విద్యార్థిని హత్యకు గురైంది. నౌకా తోలాలోని తమ ఇంట్లోకి చొరబాటుదారులు ప్రవేశించారని, ఆమె నిద్రిస్తున్న సమయంలో తన కుమార్తెపై దాడి చేశారని, ఆమెను రక్షించడానికి ప్రయత్నించినప్పుడు తన రెండు చేతులకు గాయాలయ్యాయని ఆమె తండ్రి పోలీసులకు చెప్పాడు. మిగిలిన కుటుంబం ఛత్ పూజ కోసం ఇంటి నుంచి దూరంగా ఉన్నారని, ఘటన జరిగిన సమయంలో తాను తన కుమార్తె మాత్రమే ఉన్నట్లు నిందితుడు వెల్లడించాడు.
అయితే, అనుమానించిన పోలీసులు బాలిక తండ్రిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో తానే తన కూతురిని హత్య చేసినట్లు జయనారాయణ అంగీకరించాడు. చాలా కాలంగా ఆస్తి వివాదం కారణంగా తన పొరుగువారిని ఇరికించేందుకు ఈ సంఘటనకు పాల్పడినట్లు చెప్పాడు.
తాజావార్తలు
-
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
-
Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
-
Allu Arjun Happy: హ్యాపీ రీ రిలీజ్’తో కేరళలో అల్లు అర్జున్ సెన్సేషన్.!
-
Devara : ట్రోల్స్పై మౌనం వీడిన ‘దేవర’ డీఓపీ… హీరోల హైట్ పై షాకింగ్ కామెంట్స్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!