UP Crime: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. భూ వివాదంలో ఇరుగుపొరుగు వారిని ఇరికించేందుకు ఓ తండ్రి కన్న కూతురినే హతమార్చాడు. ఈ ఘటన ఖుషినగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నలుగురు పిల్లల్లో చిన్నదైన కూతురు గొంతు కోసి హత్య చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. తన 16 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన దాదాపు రెండు వారాల తర్వాత మంగళవారం నిందితుడు జయనారాయణ్ సింగ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.