Extramarital Affair: మరిదితో వదిన రాసలీలలు.. తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Killed His Brother For Having Extramarital Affair With His Wife: రానురాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావి, వరసలు లేకుండా.. కొందరు వివాహేతర సంబంధాలు పెట్టేసుకుంటున్నారు. తాజాగా ఓ వదిన తన మరిదితోనే ఎఫైర్ పెట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. తాను చేస్తోంది పాడు పని అని తెలిసినప్పటికీ.. మరిదిని లొంగదీసుకుంది. తన భర్త లేనప్పుడు రాసలీలలు కొనసాగించింది. తన అన్నయ్యకి అన్యాయం చేస్తున్నానని తెలిసినా, వదిన మోజులో హద్దుమీరాడు. అయితే.. వీరి ఎఫైర్ ఎంతోకాలం దాగి ఉండలేదు. ఒక రోజు రెడ్హ్యాండెడ్గా మరిదితో భార్య పట్టుబడింది. దీంతో తట్టుకోలేక.. తన తమ్ముడ్ని కడతేర్చాడు అన్నయ్య. ఈ దారుణ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన సాధం కృష్ణ, సాధం నరేష్ అన్నదమ్ములు. వీళ్లిద్దరికీ పెళ్లయ్యింది. పక్కపక్క ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే.. సాదం కృష్ణ భార్య, సాదం నరేష్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ భాగస్వాములు ఇళ్లల్లో లేనప్పుడు.. వీళ్లు ఇంట్లో రాసలీలలు కొనసాగించేవారు. ఒక రోజు సాదం నరేష్ భార్య పుట్టింటికి వెళ్లడం, అదే సమయంలో సాదం కృష్ణ కూడా పని నిమిత్తం బయటికి వెళ్లడంతో.. అతని భార్య, సాదం నరేష్ ఇంట్లో ఏకాంతంగా సరసాసల్లాపాల్లో మునిగితేలారు. ఇంతలో సాదం కృష్ణ ఇంటికి తిరిగొచ్చాడు. లోపలి నుంచి తలుపు వేసి ఉండటం, తన ఇంట్లో నుంచి తమ్ముడు బయటికి రావడంతో.. వారి మధ్య వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని అన్నయ్య పసిగట్టాడు. అప్పట్నుంచి వారి మధ్య గొడవలు మొదలయ్యాయి.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
ఈ ఆదివారం కూడా గొడవ జరగడంతో.. వాళ్లిద్దరి భార్యలు తమతమ పుట్టిళ్లకు వెళ్లిపోయారు. తన భార్యతో సాదం నరేష్ అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే ఈ రాద్ధాంతం జరిగిందని.. సాదం కృష్ణ తన తమ్ముడిపై కోపం పెంచుకున్నాడు. ఆదివారం అర్థరాత్రి తాగొచ్చిన సాదం కృష్ణ.. సోమవారం తెల్లవారుజామున గొడ్డలితో సాదం నరేష్ తల నరికి చంపేశాడు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!