Luknow: లక్నోలో విషాదం.. అసలేమైందంటే…
- లక్నోలోని గోసాయిగంజ్లో స్నానం చేస్తుండగా నీటి మునిగిన ముగ్గురు పిల్లలు
- ప్రవాహంలో మరణించిన ఇద్దరు చిన్నారులు
- గ్రామంలో విషాధ ఛాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నోలో విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని గోసాయిగంజ్లో స్నానం చేస్తుండగా ముగ్గురు పిల్లలు నదిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
సాలెంపూర్లోని మజ్రా లోధ్ పూర్వా గుండా ప్రవహించే లోనీ నదిలో ముగ్గురు పిల్లలు స్నానం చేసేందుకు నదిలో దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ముగ్గురు పిల్లలు నీటిలో కొట్టుకుని పోయారు. వెంటనే ఘటనా స్థలానికి తహసీల్దార్ గోసైన్గంజ్ గుర్ప్రీత్ సింగ్, పోలీసులు చేరుకున్నారు. లోధ్ పూర్వ నివాసి అయిన గుడ్డు అనే కార్మికుడు శుక్రవారం ఉదయం 11 గంటలకు లోని నది ఒడ్డున ఉన్న పొలంలో పని చేస్తున్నాడు. అతని కుమారుడు విరాట్ (4), ఆడుకుంటూ పొరుగున ఉన్న అంకిత్ కుమార్తె హిమాని (4), సాజన్ కుమారుడు గౌరవ్ (4) తో కలిసి పొలంలోకి దిగారు. అనంతరం స్నానం చేసేందుకు ముగ్గురు పిల్లలు దిగారు. ప్రవాహంలో కొట్టుకుని పోయి ఇద్దరు పిల్లలు చనిపోయారు.
Also Read
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
ఇన్స్పెక్టర్ బ్రజేష్ కుమార్ త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం, లోధ్ పూర్వ నివాసి అయిన గుడ్డు అనే కార్మికుడు శుక్రవారం ఉదయం 11 గంటలకు లోని నది ఒడ్డున ఉన్న పొలంలో పని చేస్తున్నాడు. అతని కుమారుడు విరాట్ (4), ఆడుకుంటూ పొరుగున ఉన్న అంకిత్ కుమార్తె హిమాని (4), సాజన్ కుమారుడు గౌరవ్ (4) తో కలిసి పొలంలోకి చేరుకున్నాడు. కొంత సమయం తర్వాత, గుడ్డు ముగ్గురు పిల్లలతో ఇంటికి బయలుదేరాడు. అయితే, గుడ్డు ముందుకు వెళ్ళగానే, ముగ్గురూ నది వైపు వెళ్లి స్నానం చేయడానికి నీటిలో దూకారు. బలమైన ప్రవాహం కారణంగా, ముగ్గురూ నదిలో కొట్టుకుపోయారు. వెంటనే, అనంతరం నదిలో మునిగిపోయారు.
అక్కడే ఉన్న కేషన్ గుడ్డుకు ఫోన్ చేశాడు. కేషన్ , గుడ్డు పిల్లలను కాపాడటానికి నదిలోకి దూకారు. చాలా ప్రయత్నం తర్వాత, ముగ్గురు పిల్లలను నది నుండి బయటకు తీశారు. హిమాని ,గౌరవ్ నదిలో మునిగి మరణించారు. విరాట్ అనే బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు వెల్లడించారు. పిల్లలు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వర్షాకాలంలో పిల్లలను నది ఒడ్డుకు వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని అధికారులు, పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!