Serial Killer: 9 మంది మహిళల హత్యలకు తల్లిపై ప్రేమే కారణం!
- ఉత్తర్ ప్రదేశ్లో 13 నెలల వ్యవధిలో 9మంది మహిళల హత్య
- ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన సీరియల్ కిల్లర్
- అతడిని పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ తలాష్
- ఈ హత్యలకు బలమైన కారణం
- కారణాన్ని వెల్లడించిన కిల్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్లో 13 నెలల వ్యవధిలో 9మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడిని పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ ’తలాష్’ విజయవంతమైనందని పోలీసులు తెలిపారు. అతడి పేరుతో పాటు మరిన్ని కీలక విషయాలను వెల్లడించారు. యూపీ సీరియల్ కిల్లర్ పేరు కుల్దీప్ కుమార్ గంగ్వార్. అతడి వయస్సు 38ఏళ్లు. బరేలీ ప్రాంతంలో 13 నెలల వ్యవధిలో 9మంది మహిళలను హతమార్చాడు. పొలాల్లో ఒంరిగా పనిచేస్తున్న మహిళలే అతని టార్గెట్. అటవీ ప్రాంతాల్లోని మహిళలను కూడా అతని విడిచిపెట్టలేదు. జులై 2023- జులై 2024లో మధ్యలో బరేలీకి సమీపంలోని గ్రామాల్లో మహిళలను ఈ సీరియల్ కిల్లర్ చంపాడు. ఒంటరిగా కనపడిన మహిళల దగ్గరికి వెళ్లడం, లైంగికంగా వారికి దగ్గరవ్వడానికి ప్రయత్నించడం, ఒప్పుకోకపోతే.. తీవ్రస్థాయిలో కోపం తెచ్చుకుని, వారిని గొంతు నులిమి చంపడం ఈ సీరియల్ కిల్లర్కి అలవాటు. అనంతరం మహిళల లిప్స్టిక్లు, బిందీలు, ఐడీ కార్డులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
READ MORE: Crime: మొదట ప్రపోజ్ చేస్తాడు.. తిరస్కరిస్తే చంపేస్తాడు.. సీరియల్ కిల్లర్ కథ
Also Read
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
కాగా.. ఈ దర్యాప్తులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. ఈ హత్యలు ఎందుకు చేశాడు? ఇంత దారుణంగా ఎలా చంపుతున్నాడు? దీనికి గల ఓ బలమైన కారణం బయట పడింది. తన తల్లి జీవించి ఉండగానే తన తండ్రి బాబూరామ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో భార్య కోరిక మేరకు మొదటి భార్యను తరచూ కొట్టేవాడు. ఈ కారణంగానే నిందితుడికి తన సవతి తల్లి పట్ల ద్వేషం కలిగింది. ఈ కారణంగా అతను ఆ వయస్సులో ఉన్న మహిళలను బలిపశువులను చేయడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు 9 మందిని అంతమొందించాడు.
READ MORE:Tollywood: బాలీవుడ్ మోజులో టాలీవుడ్ కు నో చెప్పిన భామలు ఎవరంటే..?
కుల్దీప్ని పట్టుకునేందుకు ఆపరేషన్ తలాష్ని చేపట్టారు. ఇందులో భాగంగా జులైలో పోలీసులకు ఒక టిప్ వచ్చింది. దానిపై వారు వెంటనే స్పందించారు. షాహి, శీష్గఢ్ పోలీస్ స్టేషన్ల మధ్యలో 25 కి.మీల రేడియస్ని మార్క్ చేసి గాలింపు చర్యలు చేపట్టారు.”యూపీ సీరియల్ కిల్లర్ని పట్టుకునేందుకు 22 బృందాలను ఏర్పాటు చేశాము. 1,50,000 అనుమానాస్పద మొబైల్ నెంబర్లను స్కాన్ చేశాము. 1,500 సీసీటీవీ కెమెరాలను మానిటర్ చేశాము. క్రైమ్ ప్యాటర్న్ని దర్యాప్తు చేశాము,” అని బరేలీ ఎస్ఎస్పీ అనురాగ్ ఆర్య తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
-
Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్కు ఇరాన్ ఘాటు రిప్లై
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!