NTV Telugu Site icon

Serial Killer: 9 మంది మహిళల హత్యలకు తల్లిపై ప్రేమే కారణం!

Kuldeepp

Kuldeepp

ఉత్తర్​ ప్రదేశ్​లో 13 నెలల వ్యవధిలో 9మంది మహిళలను హత్య చేసిన సీరియల్​ కిల్లర్​ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడిని పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ ​’తలాష్​’ విజయవంతమైనందని పోలీసులు తెలిపారు. అతడి పేరుతో పాటు మరిన్ని కీలక విషయాలను వెల్లడించారు. యూపీ సీరియల్​ కిల్లర్​ పేరు కుల్దీప్​ కుమార్​ గంగ్వార్​. అతడి వయస్సు 38ఏళ్లు. బరేలీ ప్రాంతంలో 13 నెలల వ్యవధిలో 9మంది మహిళలను హతమార్చాడు. పొలాల్లో ఒంరిగా పనిచేస్తున్న మహిళలే అతని టార్గెట్​. అటవీ ప్రాంతాల్లోని మహిళలను కూడా అతని విడిచిపెట్టలేదు. జులై​ 2023- జులై 2024లో మధ్యలో బరేలీకి సమీపంలోని గ్రామాల్లో మహిళలను ఈ సీరియల్​ కిల్లర్​ చంపాడు. ఒంటరిగా కనపడిన మహిళల దగ్గరికి వెళ్లడం, లైంగికంగా వారికి దగ్గరవ్వడానికి ప్రయత్నించడం, ఒప్పుకోకపోతే.. తీవ్రస్థాయిలో కోపం తెచ్చుకుని, వారిని గొంతు నులిమి చంపడం ఈ సీరియల్​ కిల్లర్​కి అలవాటు. అనంతరం మహిళల లిప్​స్టిక్​లు, బిందీలు, ఐడీ కార్డులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

READ MORE: Crime: మొదట ప్రపోజ్ చేస్తాడు.. తిరస్కరిస్తే చంపేస్తాడు.. సీరియల్ కిల్లర్ కథ

కాగా.. ఈ దర్యాప్తులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. ఈ హత్యలు ఎందుకు చేశాడు? ఇంత దారుణంగా ఎలా చంపుతున్నాడు? దీనికి గల ఓ బలమైన కారణం బయట పడింది. తన తల్లి జీవించి ఉండగానే తన తండ్రి బాబూరామ్‌ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో భార్య కోరిక మేరకు మొదటి భార్యను తరచూ కొట్టేవాడు. ఈ కారణంగానే నిందితుడికి తన సవతి తల్లి పట్ల ద్వేషం కలిగింది. ఈ కారణంగా అతను ఆ వయస్సులో ఉన్న మహిళలను బలిపశువులను చేయడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు 9 మందిని అంతమొందించాడు.

READ MORE:Tollywood: బాలీవుడ్ మోజులో టాలీవుడ్ కు నో చెప్పిన భామలు ఎవరంటే..?

కుల్దీప్​ని పట్టుకునేందుకు ఆపరేషన్​ తలాష్​ని చేపట్టారు. ఇందులో భాగంగా జులైలో పోలీసులకు ఒక టిప్​ వచ్చింది. దానిపై వారు వెంటనే స్పందించారు. షాహి, శీష్​గఢ్​ పోలీస్​ స్టేషన్ల మధ్యలో 25 కి.మీల రేడియస్​ని మార్క్​ చేసి గాలింపు చర్యలు చేపట్టారు.”యూపీ సీరియల్​ కిల్లర్​ని పట్టుకునేందుకు 22 బృందాలను ఏర్పాటు చేశాము. 1,50,000 అనుమానాస్పద మొబైల్​ నెంబర్లను స్కాన్​ చేశాము. 1,500 సీసీటీవీ కెమెరాలను మానిటర్​ చేశాము. క్రైమ్​ ప్యాటర్న్​ని దర్యాప్తు చేశాము,” అని బరేలీ ఎస్​ఎస్​పీ అనురాగ్​ ఆర్య తెలిపారు.