ఛీఛీ నీచం.. కోవిడ్ శాంపిల్ పేరుతో ఆమె ప్రైవేట్ భాగంలోకి దాన్ని దూర్చి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో రోజురోజుకు కామాంధులు ఎక్కువైపోతున్నారు. ఆడవారికి ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. ఇల్లు, స్కూల్, పోలీస్ స్టేషన్, హాస్పిటల్ కూడా వారికి రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. చివరికి కోవిడ్ టెస్టుకు వచ్చిన మహిళలను కూడా కామాంధులు వదలడంలేదు. తాజాగా ఒక ల్యాబ్ టెక్నీషియన్.. కరోనా టెస్ట్ అని చెప్పి ఒక యువతి ప్రైవేట్ భాగంలో చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసులో అతనికి నాయస్థానం పదేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అమరావతిలోని ఒక మాల్ లో ఒక ఉద్యోగి కి కరోనా పాజిటివ్ అని తేలడంతో యాజమాన్య మిగతా ఉద్యోగులందరికీ కరోనా టెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. మాల్లోని ఉద్యోగులందరూ వడ్నేరాలోని ట్రామా కేర్ సెంటర్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. ట్రామా కేర్ సెంటర్లో అల్కేష్ దేశ్ముఖ్ అనే ఒక ల్యాబ్ టెక్నీషియన్ మాల్ ఉద్యోగులందరికీ కరోనా టెస్టులు చేశాడు. అందులో ఓ యువతికి కరోనా పాజిటివ్ వచ్చింది.. మిగతా టెస్టులకు ల్యాబ్ కి రావాలని తెలిపాడు. దీంతో భయపడిన ఆమె టెస్టులకు లోపలికి వెళ్ళింది. అక్కడ ఆల్కేష్ మీ ప్రైవేట్ పార్ట్ నుంచి స్వాబ్ సేకరించాల్సి ఉంటుందని చెప్పడంతో ఖంగుతిన్న యువతి తాను అలా చేయలేనని చెప్పింది. అయినా అతను వినకుండా కరోనా టెస్ట్ లో ఒక భాగమేనని నమ్మబతుకుతూ ఆమె ప్రైవేట్ పార్ట్ నుంచి ఒక స్వాబ్ శాంపిల్ సేకరించాడు. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ పార్ట్ లో చేయి పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు.
Also Read
- Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
ఇక యువతి ఈ విషయాన్నీ తన సోదరుడికి తెలుపడంతో గుట్టు రట్టయ్యింది. ఈ విషయం తెలుసుకొని కంగుతిన్న యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి వడ్నేరా పోలీస్ స్టేషన్కు వెళ్లి ల్యాబ్ టెక్నీషియన్ అల్కేష్ దేశ్ముఖ్పై కేసు నమోదు చేసింది. ఇక ఇటీవల ఈ కేసును అమరావతి జిల్లా కోర్టు విచారించి నిందితుడికి . 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. జైలు శిక్షతోపాటు నిందితుడిని రూ.10,000 జరిమానా చెల్లించవలసిందిగా ఆదేశించింది.
తాజావార్తలు
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!