Father Murder Case: జాలి లేని జన్మ.. మద్యం మత్తులో కన్న తండ్రినే కడతేర్చిన దుర్మార్గుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Murder Case: ఆస్తి, డబ్బు ముందు బంధాలు, బంధుత్వాలు చిన్నబోతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో జరిగింది. ఆస్తి కోసం సొంత తండ్రినే చంపేశాడు కొడుకు. తండ్రి అంటే గౌరవం లేదు సరికదా.. కనీసం వృద్దుడు అనే జాలి కూడా లేకుండా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు దుర్మార్గుడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.
READ ALSO: Double Murder : గండవరం పొలాల్లో రక్తపాతం.. జంట హత్యల వెనుక అసలు కథ ఇదే!
Also Read
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
ఆ వ్యక్తి పేరు నన్నే సాబ్. కర్నూలు జిల్లా కుంటనహల్ స్వగ్రామం. ఆయన గతంలో సర్పంచ్గా పని చేశాడు. నన్నే సాబ్కు గౌసియా అనే మహిళతో వివాహమైంది. వారికి నూర్ బాషా, జానెద్ బాషా, మరో కూతురు పుట్టారు. నన్నేసాబ్ , గౌసియా మధ్య తరచూ గొడవలు జరగడంతో ఇద్దరూ పదేళ్ల క్రితం విడిపోయారు. ఆ తర్వాత గౌసియా రెండవ వివాహం చేసుకుంది. గౌసియా విడాకులు తీసుకున్నా.. పిల్లలు నూర్ బాషా, జానెద్ బాషా, కూతురు తండ్రి వద్దే ఉంటున్నారు. వారికి ఇంకా పెళ్లికాలేదు. నూర్ బాషా పనిలేకుండా మద్యానికి బానిసై తిరుగుతున్నాడు. నన్నే సాబ్ కూడా భార్యకు విడాకులిచ్చిన తర్వాత రెండేళ్లకు హసీనా అనే మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. 8 ఏళ్లయినా వారికి పిల్లలు కాలేదు. రెండవ భార్య హసీనా ఇపుడు గర్భవతిగా ఉంది. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది.
నన్నే సాబ్ రెండవ వివాహం చేసుకున్నా మొదటి భార్య పిల్లలతో ఎలాంటి ఆస్తి గొడవలు రాలేదు. రెండవ భార్య హసీనా గర్భం దాల్చడంతో ఆస్తి రాకుండా పోతుందేమోనని మొదటి భార్య కుమారుడు నూర్ బాషా తరచూ గొడవ పెట్టుకుంటున్నాడు. నన్నే సాబ్కి ఐదుగురు అన్నదమ్ములు. ఇంకా ఆస్తులు.. పొలాలు పంచుకోలేదు. పెద్ద భార్య కుమారుడు ఆస్తి అడిగితే.. అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్న తరువాత రావలసిన భాగం ఇస్తామని నూర్ బాషాకి తండ్రి చెప్పాడు. కానీ నూర్ బాషా వినిపించుకోలేదు. 3 రోజుల క్రితం ఇదే విషయంపై పెద్దమనుషుల మధ్య పంచాయితీ కూడా చేశారు. అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్న తరువాత ఇస్తామంటే.. నూర్ బాషా ఒప్పుకున్నాడు. అంతలోనే రాత్రి అందరూ పడుకున్న తరువాత తండ్రి నన్నే సాబ్ని కత్తితో పొడిచి చంపాడు నూర్ బాషా. తండ్రిని చంపేస్తే ఆస్తి వస్తుందని మద్యం మత్తులో గొంతుకోసి హత్య చేశాడు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. మొత్తానికి మద్యం మత్తులో ఆస్తి కోసం కన్న తండ్రినే చంపేశాడు నూర్ బాషా. ఇప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కుని జైలుపాలయ్యాడు. క్షణికావేశంలో చేసిన హత్య కారణంగా.. ఆస్తి రావడం కాదు కదా ఇప్పుడు జీవితం కూడా దిక్కుతోచని స్థితిలో పడింది.
READ ALSO: Best Tea Gardens : చాయ్ లవర్స్.. ఈ 5 అద్భుతమైన ప్లేసెస్లో మీ ఫేవరెట్ ఏది?
తాజావార్తలు
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
-
Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!