Kukatpally Suicide: కూకట్పల్లి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. వెలుగులోకి కీలక విషయాలు..
- కుటుంబ విషాదానికి అసలు కారణం ఏంటి?
- రెండో పెళ్లితో మొదలైన వివాదం
- ఆస్తి కోణంలో కొత్త అనుమానాలు
- భర్తపై బంధువుల తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్పల్లి పరిధిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విగతజీవులుగా పడి ఉండటం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. స్రవంతి అనే మహిళ తన ఇద్దరు కుమారులను (12 ఏళ్లు , 10 ఏళ్లు) చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఇది ఆత్మహత్య కాదని, భర్త ప్రవీణ్ చేసిన పథకం ప్రకారమే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
స్రవంతికి, ప్రవీణ్కు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ప్రవీణ్ తన మేనత్త కూతురిని రెండో పెళ్లి చేసుకోవడంతో దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. మొదటి భార్యకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ప్రవీణ్ తల్లిదండ్రులు (స్రవంతి అత్తమామలు) కొంత స్థలాన్ని ఆమె పేరు మీద రాసిచ్చారు.
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
కొంతకాలం తర్వాత ప్రవీణ్ను రెండో భార్య కూడా వదిలి వెళ్లడంతో, అతను తిరిగి స్రవంతికి దగ్గరయ్యాడు. అయితే, ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని తిరిగి తన పేరు మీదకు మార్చాలని ప్రవీణ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో నిన్న రాత్రి కూడా పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగిందని, ఆ తర్వాతే ఈ ఘోరం జరిగిందని తెలుస్తోంది.
మృతదేహాలను చూసిన బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వారి శరీర రంగు మారిపోయిందని, ప్రవీణే రాత్రిపూట ముగ్గురిని చంపి, ఉదయం ఏమీ ఎరుగనట్లు పనికి వెళ్లి, మధ్యాహ్నం వచ్చి డ్రామా ఆడుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు.
సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ వేధింపుల భరించలేక స్రవంతి ఈ నిర్ణయం తీసుకుందా లేక దీని వెనుక ప్రవీణ్ హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!