Crime: ఆ తర్వాత ఆమెను తీసుకువెళ్లింది ఎవరు?
- కిస్మత్పురా నిర్మానుష్య ప్రాంతం
- బ్రిడ్జి కింద మహిళ డెడ్ బాడీ కలకలం
- నాంపల్లి చెందిన రేష్మ బేగంగా గుర్తింపు
- ఆ తర్వాత ఆమెను తీసుకువెళ్లింది ఎవరు?
- ఆమెను హత్య చేసింది ఎవరు?
- అనే అంశంపై పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో మహిళల డెడ్ బాడీలు కలకలం రేపుతున్నాయి. చర్లపల్లి రైల్వై స్టేషన్ పక్కనే మహిళ డెడ్ బాడీ ఘటన మర్చిపోక ముందే రాజేంద్రనగర్ కిస్మత్పురా వద్ద మరో మహిళ మృతదేహం.. నగ్నంగా పడి ఉంది. ఆ మహిళ ఎవరు? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? ఆమెను అక్కడే చంపేశారా? ఎక్కడైనా చంపేసి కిస్మత్పురాలో పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో సెప్టెంబర్ 16న గుర్తించారు స్థానికులు. మహిళ డెడ్ బాడీ.. నగ్నంగా పడి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు స్టార్ట్ చేశారు పోలీసులు. చనిపోయిన మహిళను నాంపల్లి చెందిన రేష్మ బేగంగా గుర్తించారు…
Rakul Preet : రకుల్ పరువాల నిధులు.. చూస్తే మతులు పోవాల్సిందే
Also Read
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
- HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
- Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
కానీ నాంపల్లి నుంచి రాజేంద్రనగర్ కిస్మత్పురా వరకు మహిళ ఎలా వచ్చారు? అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మహిళ మృతదేహం పైన ఎలాంటి దుస్తులు లేకపోవడం.. అతి కిరాతకంగా చంపేయడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళ పైన అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే విచారణ చేస్తున్నట్లు చెబుతున్నారు… గుర్తు తెలియని వ్యక్తులు.. ఆటోలో మహిళ డెడ్ బాడీని తీసుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అప్పటికే ఆమె ఒంటిపై దుస్తులు లేవని చెప్పారు. దర్యాప్తులో భాగంగా కొంత సమాచారం సేకరించారు పోలీసులు. ఆమె ఆఘాపురా నుంచి ఆటోలో కిస్మత్ పురా వచ్చినట్లు చెబుతున్నారు. అక్కడే కల్లు కాంపౌండ్లో కల్లు తాగినట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత ఆమెను తీసుకువెళ్లింది ఎవరు..? ఆమెను హత్య చేసింది ఎవరు..? అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. అత్యాచారం, హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు వెల్లడించారు…
Mirai : తేజ నిర్ణయం సక్సెస్.. మిగతా హీరోలు ఫాలో అయితే బెటర్..
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!