Crime: ఆ తర్వాత ఆమెను తీసుకువెళ్లింది ఎవరు?
- కిస్మత్పురా నిర్మానుష్య ప్రాంతం
- బ్రిడ్జి కింద మహిళ డెడ్ బాడీ కలకలం
- నాంపల్లి చెందిన రేష్మ బేగంగా గుర్తింపు
- ఆ తర్వాత ఆమెను తీసుకువెళ్లింది ఎవరు?
- ఆమెను హత్య చేసింది ఎవరు?
- అనే అంశంపై పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో మహిళల డెడ్ బాడీలు కలకలం రేపుతున్నాయి. చర్లపల్లి రైల్వై స్టేషన్ పక్కనే మహిళ డెడ్ బాడీ ఘటన మర్చిపోక ముందే రాజేంద్రనగర్ కిస్మత్పురా వద్ద మరో మహిళ మృతదేహం.. నగ్నంగా పడి ఉంది. ఆ మహిళ ఎవరు? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? ఆమెను అక్కడే చంపేశారా? ఎక్కడైనా చంపేసి కిస్మత్పురాలో పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో సెప్టెంబర్ 16న గుర్తించారు స్థానికులు. మహిళ డెడ్ బాడీ.. నగ్నంగా పడి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు స్టార్ట్ చేశారు పోలీసులు. చనిపోయిన మహిళను నాంపల్లి చెందిన రేష్మ బేగంగా గుర్తించారు…
Rakul Preet : రకుల్ పరువాల నిధులు.. చూస్తే మతులు పోవాల్సిందే
Also Read
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
కానీ నాంపల్లి నుంచి రాజేంద్రనగర్ కిస్మత్పురా వరకు మహిళ ఎలా వచ్చారు? అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మహిళ మృతదేహం పైన ఎలాంటి దుస్తులు లేకపోవడం.. అతి కిరాతకంగా చంపేయడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళ పైన అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే విచారణ చేస్తున్నట్లు చెబుతున్నారు… గుర్తు తెలియని వ్యక్తులు.. ఆటోలో మహిళ డెడ్ బాడీని తీసుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అప్పటికే ఆమె ఒంటిపై దుస్తులు లేవని చెప్పారు. దర్యాప్తులో భాగంగా కొంత సమాచారం సేకరించారు పోలీసులు. ఆమె ఆఘాపురా నుంచి ఆటోలో కిస్మత్ పురా వచ్చినట్లు చెబుతున్నారు. అక్కడే కల్లు కాంపౌండ్లో కల్లు తాగినట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత ఆమెను తీసుకువెళ్లింది ఎవరు..? ఆమెను హత్య చేసింది ఎవరు..? అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. అత్యాచారం, హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు వెల్లడించారు…
Mirai : తేజ నిర్ణయం సక్సెస్.. మిగతా హీరోలు ఫాలో అయితే బెటర్..
తాజావార్తలు
-
R Ashwin: ఉన్నపళంగా ఇంటికి పోలీసులు.. షాక్కు గురైన అశ్విన్.. అసలు కారణం ఇదే!
-
SBI Clerk Recruitment 2026: ఎస్బీఐలో 9,124 క్లర్క్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, పరీక్ష వివరాలు
-
Bomb Threat: రాజధానిలో హై అలర్ట్.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో బాంబు బెదిరింపులు..
-
Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
-
NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమా ఆగిందా.. పుకార్లలో వాస్తవం ఎంత?
ట్రెండింగ్
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!