Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
- కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో 21 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది.
- ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో అపహరణ.
- అత్యాచారం అనంతరం యువతి హత్య
- నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాలకృత్యాల కోసం బయటకు వెళ్లిన 21 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఒక వ్యవసాయ బావి వద్ద కనుగొన్నారు. ఆగస్టు 19 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హోక్రాణి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధితురాలి తండ్రి తిమ్మారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. తిమ్మారెడ్డి కుమార్తె అశ్విని తన తల్లిదండ్రులతో కలిసి పొలాల్లో పని ముగించుకుని సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చింది. బి.ఏ డిగ్రీ పూర్తి చేసుకున్న అశ్విని, ఆ తర్వాత కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో, ఒక పాత్రను తీసుకుని సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి వెతకడానికి వెళ్లిన క్రమంలో అశ్విని చెప్పులు కనిపించాయి. కుటుంబ సభ్యులంతా రాత్రంతా అశ్విని కోసం వెతికారు. ఆగస్టు 20వ తేది ఉదయం, ఒక వ్యవసాయ బావి వద్ద మృతదేహం కనిపించింది.
Also Read
- Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
- Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
అశ్విని శరీరంపై గాయాలు అయ్యాయి, బట్టలు లేని స్థితిలో మృతదేహం కనిపించింది. ఈ ఘటనలో గుండ్యా (22), మహంతేశ్ (22), వీరేశ్ (23), ముండర్గి బసవరాజ్ (సుమారు 45) నిందితులుగా ఉన్నారు. వీరంతా ఇదే గ్రామానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. అశ్వినికి ఈ ఘటనకు సుమారు నెల రోజుల ముందే నిశ్చితార్థం జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు.
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
-
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
-
India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
-
Telugu Film Industry : తెలుగు సినిమాకు తెలంగాణ సర్కార్ బిగ్ బూస్ట్.. కొత్త జీవోతో గేమ్చేంజ్.!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!