Tragedy : రైల్వే ట్రాక్ వద్ద లభించిన డెడ్ బాడీ వెనుక దాగి ఉన్న ఘోర నిజం..!
- బొమ్మకల్లోని రైల్వే ట్రాక్ వద్ద జులై 29న ఓ డెడ్ బాడీ
- సుభాష్నగర్కు చెందిన ఐలవేణి సంపత్దిగా గుర్తింపు
- సంపత్ కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు
- దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : వివాహేతర బంధాలు హత్యకు దారి తీస్తున్నాయి. దేశంలోని ఏ కేసు తీసుకున్నా.. ఇదే జరుగుతోంది. తాజాగా కరీంనగర్ శివారులో జరిగిన ఓ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వెనుక వివాహేతర బంధమే కారణమని తేల్చారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కరీంనగర్ శివారు ప్రాంతంమైన బొమ్మకల్లోని రైల్వే ట్రాక్ వద్ద జులై 29న ఓ డెడ్ బాడీ కనిపించింది. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వ్యక్తి డెడ్ బాడీని.. కరీంనగర్లోని సుభాష్నగర్కు చెందిన ఐలవేణి సంపత్దిగా గుర్తించారు పోలీసులు. ఈ మృతి అనుమానాస్పదంగా ఉండడం.. సంపత్ కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..
ఐతే ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. పక్కా మర్డర్గా విచారణలో తేలింది. ముఖ్యంగా హత్యలో సంపత్ భార్య ఐలవేణి రమాదేవి హస్తం ఉందని అనుమానించారు. ఆ దిశగా విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది… కొన్నాళ్లుగా రమాదేవికి కిసాన్ నగర్కు చెందిన కర్రె రాజయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కాస్తా భర్త సంపత్కు తెలిసింది. దీంతో ఇంట్లో గొడవలు షురూ అయ్యాయి. అంతే కాదు ఇదే విషయంపై ఆగ్రహంతో ఉన్న సంపత్ నిత్యం మద్యం తాగుతూ బానిసగా మారాడు. అంతే కాదు మద్యం మత్తులో రమాదేవిని కొడుతుండేవాడు. ఫలితంగా విసిగిపోయిన రమాదేవి.. సంపత్ హత్యకు స్కెచ్ వేసింది. అనుకున్నదే తడవుగా ప్రియుడు రాజయ్యతోపాటు దూరపు బంధువైన ఖాదర్ గూడెంకు చెందిన కీసరి శ్రీనివాస్తో కలిసి ప్లాన్ చేసింది…
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
Hyderabad: నగరం నడిబొడ్డులో పట్ట పగలే హత్య.. కత్తులతో దారుణంగా నరికి…
ప్లాన్ ప్రకారం జులై 29న రాజయ్య, శ్రీనివాస్ కలిసి సంపత్ను బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు రమ్మన్నారు. అక్కడే అతనికి బాగా మద్యం తాగించారు. సంపత్ పూర్తిగా మత్తులోకి వెళ్లాడని భావించిన తర్వాత.. అతని భార్య రమాదేవికి ఫోన్ చేశారు. చంపేయమని చెప్పడంతో.. నిందితులు తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందును సంపత్ చెవిలో పోశారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత డెడ్ బాడీని రైల్వే ట్రాక్ పక్కన పడేసి వెళ్లిపోయారు…
ఇక సంపత్.. కనిపించడం లేదని భార్య రమాదేవి ఇంటి దగ్గర డ్రామా షురూ చేసింది. ఆ డ్రామాలో నిందితులు కూడా పాల్గొన్నారు. అతన్ని వెతుకుతున్నట్లు నటించారు. అంతా కలిసి డ్రామా రక్తి కట్టించినప్పటికీ.. పోలీసులు స్ట్రాంగ్గా దర్యాప్తు చేయడంతో దొరికిపోయారు…
Shocking : మైక్రోప్లాస్టిక్స్ మెదడులో పేరుకుపోతున్నాయా..? కొత్త అధ్యయనంలో షాకింగ్ నిజాలు..!
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!