Murder : భార్యను చంపి అడవిలో పడేసిన భర్త!
- పెద్ద చీపాడులో భార్య సుజాతను హత్య చేసిన భర్త గోపాల్
- వివాహేతర సంబంధం కారణంగా పెరిగిన కలహాలు
- చివరికి దారుణ హత్య
- శవాన్ని వనిపెంట అటవీ ప్రాంతంలో పడేసి
- తర్వాత పోలీసులకు లొంగిన హంతకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప జిల్లాగండికోటలోమైనర్ బాలిక హత్య ఉదంతం తేలక మునుపే, పెద్ద చీపాడులో మరో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా కట్టుకున్న భార్యను హత్య చేశాడు భర్త. అంతే కాదు శవాన్ని అడవిలో పడేసి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. కడప జిల్లా చాపాడు మండలం పెద్ద చీపాడుకి చెందిన నల్లబోతుల గోపాల్, సుజాతకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వృత్తిరీత్యా గోపాల్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా జీవనం సాగిస్తుండేవాడు. వీరికి ఇద్దరు కుమారులు. సాఫీగా సాగుతున్న సంసారంలో భార్య సుజాత నిప్పు రాజేసింది..
సుజాతకు అదే గ్రామానికి చెందిన చెన్నయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కల్లూరుకు చెందిన చెన్నయ్య.. వృత్తిరీత్యా మేస్త్రీగా పనిచేస్తూ పెద్ద చీపాడులో నివాసం ఉంటున్నాడు. సుజాత తల్లిదండ్రులు ఇంటి నిర్మించే క్రమంలో చెన్నయ్యతో పరిచయం ఏర్పడింది. వీరు తరచూ కలుస్తుండడం ఆ నోటా ఈ నోటా భర్తకు తెలిసింది. బంధువులు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి మందలించినా సుజాత తీరు మారలేదు. దీంతో గోపాల్ సంసారాన్ని హైదరాబాదుకి మార్చాడు. కొద్దికాలం నివాసం ఉన్న తర్వాత మళ్లీ పెద్ద చీపాడు వైపే సుజాత గాలి మళ్లింది. మళ్లీ వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది..
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రిస్తున్న సుజాతను కత్తితో అతి దారుణంగా నరికి చంపేశాడు. ఆ తరువాత గుర్తు చప్పుడు కాకుండా గోనెసంచిలో వేసుకొని స్కూటీపై తీసుకు వెళ్లి మైదుకూరు మండలం వనిపెంట అటవీ ప్రాంతంలోని ఓ లోయలో పడేసి ఇంటికి వచ్చాడు..
మరుసటి రోజు గోపాల్ కడప పరిసర ప్రాంతాల్లో సంచరించి మైదుకూరులో కూడా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తిరిగాడు. పోలీసులకు సమాచారం అందించి లొంగిపోవాలని ప్రయత్నించాడు. కానీ తనకు తెలిసిన ఒక హోంగార్డు తో విషయాన్ని తెలియజేయడంతో స్టేషన్కి వెళ్లి లొంగిపోవాలని సలహా ఇవ్వగా.. చాపాడు పోలీస్ స్టేషన్లో చెప్పి లొంగిపోయాడు. పోలీసులు హంతకున్ని వెంటబెట్టుకొని వనిపెంట అటవీ ప్రాంతంలో రాత్రి సమయంలో వెతకగా ఆచూకీ దొరకలేదు. శనివారం ఉదయం అదే ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా సుజాత మృతదేహం లభ్యమైంది. సుజాత హత్య జరిగి రెండు రోజులు కావడంతో డెడ్ బాడీ కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో అక్కడే పోస్టుమార్టం చేసి పంచనామా చేశారు. భర్త గోపాల్ పై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు…
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..