Juvenile Offenders Escape: వీరి వయసు 16 నుంచి 17 ఏళ్లు.. ఏకంగా జైలు నుంచే పరార్..
- వారంతా వివిధ నేరాలు చేసి.. శిక్ష అనుభవిస్తున్న బాల నేరస్తులు..
- సత్ప్రవర్తన నేర్చుకునేలా వారిని జువెనైల్ హోమ్లో ఉంచారు..
- అలాంటి జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు..
- మిగతా బాలురు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి జువైనల్ సిబ్బంది..
- చుట్టుపక్కల వెతికినా దొరకని ఆచూకీ.. 15 రోజులవుతున్నా కనిపించని జాడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Juvenile Offenders Escape: బాల నేరస్తులు గోడ దూకేశారు.. !! అధికారుల కళ్లుగప్పి ఏకంగా తాళం పగులగొట్టుకుని పారిపోయారు. సైదాబాద్లో ఉన్న జువెనైల్ హోమ్ నుంచి ఐదుగురు బాల నేరస్తులు పరారయ్యారు. ట్విస్ట్ ఏంటంటే.. పారిపోయి 15 రోజులైనా పోలీసులు గానీ.. జువెనైల్ హోమ్ సిబ్బంది కానీ.. ఇంకా వారిని పట్టుకోలేదు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోల్లో ఉన్న ఐదుగురు బాలురు.. జువైనల్ హోమ్ నుంచి పరారయ్యారు. వీరి వయసు 16 నుంచి 17 ఏళ్ల వరకు ఉంటుంది. జులై 21న రాత్రి అంతా గ్రౌండ్ ఫ్లోర్లో భోజనం చేశారు. ఆ తర్వాత ఈ ఐదుగురు మైనర్ బాలురు ఫస్ట్ ఫ్లోర్కు వెళ్లారు. జువైనల్ హోమ్ అధికారుల కంట పడకుండా అక్కడ ఉన్న ఇనుప గ్రిల్స్ తాళం తొలగించారు. ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు దారి పరారయ్యారు… స్పాట్..
Read Also: Hyderabad: వీకెండ్ వచ్చిందంటే చాలు… హైదరాబాద్ శివారు బాట పడుతున్న యువత..!
Also Read
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
ఇక, ఐదుగురు బాలురు పారిపోయిన ఘటనపై జువైనల్ హోమ్లో ఉన్న మిగతా బాలురు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన జువైనల్ హోమ్ సిబ్బంది.. చుట్టు పక్కల అంతా వెతికారు. కానీ వారి ఆచూకీ ఎక్కడా లభించలేదు. ఐతే ఉదయం జువైనల్ హోమ్ అధికారులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు15 రోజులవుతున్నా వారి జాడ కనిపించలేదు. అటు పోలీసులు కానీ.. ఇటు జువైనల్ హోమ్ సిబ్బంది కానీ వారిని పట్టుకోలేకపోయారు. పారిపోయిన ఐదుగురిలో ముగ్గురు తెలంగాణకు చెందినవారు కాగా.. మిగతా ఇద్దరు ఏపీకి చెందిన వారు అని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..