Honour killing: పరువు పోయిందని.. నవదంపతుల దారుణ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభివృద్ధిలో.. టెక్నాలజీతో పోటీ పడుతూ అంతా పరుగులు పెడుతున్నా.. ఇంకా మతం, కులం లాంటివి అడ్డుగోడలుగా నిలిస్తున్నాయి.. పరువు తీశారని.. ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.. కులాంతర వివాహం చేసుకున్నా.. మతాంతర వివాహం చేసుకున్నా జీర్ణించుకోలేక వెంటాడి వెంబడించి చంపేస్తున్నవారు కొందరైతే.. నమ్మించి గొంతుకోసే దారుణమైన మనుషులు కూడా ఉన్నారు.. తాజాగా, తమిళనాడులో జరిగిన డబుల్ మర్డర్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
Read Also: Presidential poll: దీదీ సమావేశానికి కేసీఆర్ దూరం.. కారణం అదేనా..?
Also Read
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
తమిళనాడులోని కుంభకోణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న శరణ్యను మోహన్ అనే యువకుడు ప్రేమించాడు.. అయితే, వారి పెళ్లికి కులం అడ్డుగా నిలిచింది.. వారి వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.. అంతేకాదు.. శరణ్యను సమీప బంధువైన రంజిత్కు ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తమ్ముడు శక్తివేల్ పట్టుబట్టాడు. అయితే, పెద్దలను, తమ్ముడిని ఎదిరించి శరణ్య.. తాను ప్రేమిస్తున్న వేరే కులానికి చెందిన మోహన్ను ఐదు రోజుల క్రితం పెళ్లి చేసుకుంది.. విడిగా కాపురం పెట్టారు. అయితే, ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు శరణ్య తమ్ముడు శక్తివేల్.. వాళ్లను ఎలాగైనా మట్టుబెట్టాలని ప్లాన్ చేశాడు.. జరిగింది ఎదో జరిగిపోయింది.. పార్టీ చేసుకుందాం రండీ అంటూ కుంభకోణం సమీపంలోని ఓ ప్రాంతానికి శరణ్య-మోహన్ను పిలిపించాడు.. పార్టీలో ఉన్న సమయంలో తమ్ముడు శక్తివేల్, శరణ్యను పెళ్లి చేసుకోవాలని చూసిన రంజిత్ ఒక్కసారిగా నవ దంపతులపై దాడి చేశారు.. కత్తిలతో పొడి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టరు.. అయితే, శక్తివేల్, రంజిత్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!