Indore: పెళ్లి చేసుకుంటానని విడాకులు తీసుకున్న మహిళపై అత్యాచారం..
- పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం..
- విడాకులు తీసుకున్న మహిళని మోసం చేసిన నిందితుడు..
- నిందితుడికి పెళ్లయి అప్పటికే నలుగురు పిల్లలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indore: దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో చోట మహిళపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు మహిళలపై అత్యాచారాలు దగ్గరి వ్యక్తులు, తెలిసిన వ్యక్తుల నుంచే ఎదురవుతున్నాయి. తాజాగా ఇండోర్లో ఓ వ్యక్తి మహిళను నమ్మించి అత్యాచారానికి ఒడిగట్టాడు. విడాకులు తీసుకున్న మహిళని పెళ్లి చేసుకుంటా అని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సదరు వ్యక్తికి అప్పటికే పెళ్లైనప్పటికీ, తాను సింగిల్ అని చెబుతూ నమ్మిస్తూ వచ్చాడు.
ఈ కేసులో నోయిడాకు చెందిన మహ్మద్ అకీల్ అనే నిందితుడిపై మహిళ ఫిర్యాదు చేసింది. నిందితుడు తాను సింగిల్ అని చెబుతూ, మహిళతో స్నేహం చేశాడు. అనంతరం ఇండోర్ వచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు.నిందితుడు మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పి వారం రోజుల క్రితం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, ఢిల్లీలో ఉన్నప్పుడు నిందితుడికి అప్పటికే పెళ్లయి నలుగురు పిల్లలు ఉన్నట్లు, తాను పెళ్లి చేసుకోలేనని మహిళతో చెప్పాడు.
Also Read
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
తాను విడాకులు తీసుకున్నట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తనకు మహ్మద్ అఖిల్తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడినట్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసింది. దాదాపు రెండు నెలల క్రితం, ఆమె కేదార్నాథ్ పర్యటన నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఢిల్లీలో అఖిల్ని కలిసింది. అఖిల్ ఇండోర్ వచ్చి తనతో రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకున్నట్లు ఆమె పేర్కొంది. తనను పెళ్లి చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్దామని అతను తనకు చెప్పినట్లు తెలిపింది. ఆగస్టు 13న ఇద్దరు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కూడా నిందితుడు సదరు మహిళతో సంబంధాన్ని కొనసాగించాడు.
ఇదిలా ఉండగా, తనకు అప్పటికే వివాహమైనట్లు చెప్పాడని మహిళ పేర్కొంది. తన భార్య ఉత్తర్ప్రదేశ్లో నివసిస్తుందని, తనకు నలుగురు పిల్లలు ఉన్నట్లు చెప్పాడని చెప్పినట్లు మహిళ వెల్లడించింది. దీని తర్వాత మహిళ ఇండోర్ తిరిగి వచ్చింది. ఈ ఘటనను రైట్ వింగ్ కార్యకర్తలకు చెప్పడంతో వారు అఖిల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
-
Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..