Indore: పెళ్లి చేసుకుంటానని విడాకులు తీసుకున్న మహిళపై అత్యాచారం..
- పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం..
- విడాకులు తీసుకున్న మహిళని మోసం చేసిన నిందితుడు..
- నిందితుడికి పెళ్లయి అప్పటికే నలుగురు పిల్లలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indore: దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో చోట మహిళపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు మహిళలపై అత్యాచారాలు దగ్గరి వ్యక్తులు, తెలిసిన వ్యక్తుల నుంచే ఎదురవుతున్నాయి. తాజాగా ఇండోర్లో ఓ వ్యక్తి మహిళను నమ్మించి అత్యాచారానికి ఒడిగట్టాడు. విడాకులు తీసుకున్న మహిళని పెళ్లి చేసుకుంటా అని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సదరు వ్యక్తికి అప్పటికే పెళ్లైనప్పటికీ, తాను సింగిల్ అని చెబుతూ నమ్మిస్తూ వచ్చాడు.
ఈ కేసులో నోయిడాకు చెందిన మహ్మద్ అకీల్ అనే నిందితుడిపై మహిళ ఫిర్యాదు చేసింది. నిందితుడు తాను సింగిల్ అని చెబుతూ, మహిళతో స్నేహం చేశాడు. అనంతరం ఇండోర్ వచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు.నిందితుడు మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పి వారం రోజుల క్రితం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, ఢిల్లీలో ఉన్నప్పుడు నిందితుడికి అప్పటికే పెళ్లయి నలుగురు పిల్లలు ఉన్నట్లు, తాను పెళ్లి చేసుకోలేనని మహిళతో చెప్పాడు.
Also Read
తాను విడాకులు తీసుకున్నట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తనకు మహ్మద్ అఖిల్తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడినట్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసింది. దాదాపు రెండు నెలల క్రితం, ఆమె కేదార్నాథ్ పర్యటన నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఢిల్లీలో అఖిల్ని కలిసింది. అఖిల్ ఇండోర్ వచ్చి తనతో రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకున్నట్లు ఆమె పేర్కొంది. తనను పెళ్లి చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్దామని అతను తనకు చెప్పినట్లు తెలిపింది. ఆగస్టు 13న ఇద్దరు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కూడా నిందితుడు సదరు మహిళతో సంబంధాన్ని కొనసాగించాడు.
ఇదిలా ఉండగా, తనకు అప్పటికే వివాహమైనట్లు చెప్పాడని మహిళ పేర్కొంది. తన భార్య ఉత్తర్ప్రదేశ్లో నివసిస్తుందని, తనకు నలుగురు పిల్లలు ఉన్నట్లు చెప్పాడని చెప్పినట్లు మహిళ వెల్లడించింది. దీని తర్వాత మహిళ ఇండోర్ తిరిగి వచ్చింది. ఈ ఘటనను రైట్ వింగ్ కార్యకర్తలకు చెప్పడంతో వారు అఖిల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!