Priest : పూజకు పిలిచిన మోసగాళ్లు.. పురోహితుడి జేబే ఖాళీ చేశారు.!
- మిలిటరీ కార్యాలయం పేరుతో పురోహితుడిని నమ్మించిన నేరగాళ్లు
- రూ.10 అడ్వాన్స్తో విశ్వాసం కలిగించి కార్డు వివరాలు సొంతం
- విడతల వారీగా రూ.5.99 లక్షలు ఖాతా నుంచి మాయమయ్యాయి
- 1930కి ఫిర్యాదు చేసిన బాధితుడు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priest : హైదరాబాద్ నగరంలో మరోసారి సైబర్ మోసం వెలుగుచూసింది. 52 ఏళ్ల వయసు గల ఓ పురోహితుడు నేరగాళ్లకు బలై, లక్షల రూపాయలు కోల్పోయాడు. పాతబస్తీ పురానాపూల్ ప్రాంతానికి చెందిన ఈ పురోహితుడిని సైబర్ దుండగులు పూజ పేరుతో మోసం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే… సికింద్రాబాద్ మిలిటరీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ కొందరు మోసగాళ్లు ఆ పురోహితుడికి ఫోన్ చేశారు. “మా కల్నల్ సర్ ఆరోగ్యం బాగోలేదు. ఆయన కోసం 11 రోజులపాటు ప్రత్యేక పూజ చేయాలి. దానికి 21 మంది పురోహితులు అవసరం. ఈ పూజకు అడ్వాన్స్గా రూ.3 లక్షలు ఇస్తాం” అని చెప్పి నమ్మించారు. మొదట నమ్మకాన్ని కలిగించేందుకు ఆయన ఖాతాలో రూ.10 పంపించారు.
BCCI-Dream 11: డ్రీమ్ 11తో బీసీసీఐ ఒప్పందం రద్దు.. ఐపీఎల్కూ రాంరాం!
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
తరువాత వీడియో కాల్ చేసి, మిగతా మొత్తం పంపుతామని చెప్పి మోసగాళ్లు జాగ్రత్తగా పురోహితుడి డెబిట్ కార్డు నంబర్, పిన్ వంటి ముఖ్యమైన వివరాలు తీసుకున్నారు. ఈ సమాచారాన్ని ఉపయోగించి విడతల వారీగా మొత్తంగా రూ.5.99 లక్షలు కాజేశారు. కొద్ది గంటలకే తన ఖాతాలోని మొత్తం డబ్బు గల్లంతైనట్లు గుర్తించిన పురోహితుడు సైబర్ మోసానికి గురయ్యానని గ్రహించారు. తక్షణమే ఆయన సైబర్ మోసాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నేరగాళ్ల ఫోన్ నంబర్లు, లావాదేవీల వివరాలను సేకరించి వారి జాడ కోసం శోధిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ… అనుమానాస్పద ఫోన్ కాల్స్, పూజలు లేదా ఇతర ఆఫర్ల పేరుతో వచ్చే డబ్బు డిమాండ్లను నమ్మొద్దని సూచించారు. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా నంబర్లు, కార్డు వివరాలు, పిన్ వంటి గోప్యమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. మొత్తానికి, పూజ పేరుతో నమ్మబలికి 52 ఏళ్ల పురోహితుడిని మోసగాళ్లు దాదాపు రూ.6 లక్షలు కాజేయగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!