Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- హైదరాబాద్లో దారుణం
- ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- బట్టబయలు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియుడితో జీవితం పంచుకోవాలనుకుంది.. కానీ కూతురు అడ్డురావడంతో.. కన్నపేగును తెంచుకోవాలని డిసైడైంది. ఆ సమయంలోనే ఆ తల్లి కన్నింగ్ ఆలోచన చేసింది. కూతురును కడతేర్చితే.. ప్రియుడితో హాయిగా ఉండవచ్చని భావించింది. సీన్ కట్ చేస్తే.. కూతురును చంపిన కేసులో జైలులో ఊచలు లెక్కబెడుతోంది. ఇలాంటి కసాయి తల్లులు కూడా ఉంటారా అనే అనిపించే ఈ దారుణం ఘటన హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
ఈ మహిళ పేరు రేఖ. అల్వాల్ ఓల్డ్ అంబేద్కర్నగర్ ప్రాంతానికి చెందిన యాదగిరి కూతురు. ఈమెకు తల్లిదండ్రులు 2020లో పెళ్లి చేశారు. ఐతే పెళ్లినాటికే ఆమె 7 నెలల గర్భవతిగా ఉంది. పెళ్లైన కొద్ది రోజులకే పాపకు జన్మనిచ్చింది. గర్భం విషయం దాచిపెట్టి తనతో వివాహం జరిపించారని భర్త ఫైర్ అయ్యాడు. దీంతో ప్రతి రోజూ ఇంట్లో భార్యాభర్త మధ్య గొడవలు జరుగుతుండేవి. చివరకు వారు వేర్వేరుగా నివసించడం ప్రారంభించారు.
Also Read
ఇక యాదగిరి కుటుంబం ఓల్డ్ అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపానికి మారిన తర్వాత.. అక్కడే ఉంటున్న రేఖకు సమీపంలోని కిరాణా షాపులో పనిచేసే సాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. సాయిని వివాహం చేసుకోవాలని రేఖ ఒత్తిడి చేసింది. ఇప్పటికే ఆమెకు వివాహమై కూతురు ఉన్నందున సాయి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. చివరకు సాయి కూడా పెళ్లి చేసుకోలేనని చెప్పి ఆమె ఫోన్ నంబర్ను బ్లాక్ చేశాడు. అయితే అతడిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రేఖ ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. తన పెళ్లికి కూతురు అడ్డుగా ఉందని భావించి.. ఆ చిన్నారి తన్వికను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
వారం రోజుల పాటు కూతురును చంపేందుకు స్కెచ్చేసిన రేఖ.. చివరకు మే 16న ముహూర్తం ఖరారు చేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన్వికను ఇంటి పైకప్పు పైకి తీసుకెళ్లింది. అక్కడ ఉన్న నీటి ట్యాంకులో పడేసి మూత బిగించి… ట్యాంకును నీటితో నింపింది. నీళ్లలో గిలగిలా కొట్టుకుంటున్నచిన్నారిపై కాస్తంత కూడా కనికరం చూపించలేదు. పాప చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. తన్విక కనిపించడం లేదని కుటుంబ సభ్యుల వద్ద నాటకం ఆడింది…
చిన్నారి కోసం కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు చాలా ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా కనిపించలేదు. దీంతో రేఖ ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె సోదరి శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించగా.. రేఖ డ్రామా అంతా బయటపడింది. తన్వికను టెర్రస్పైకి తీసుకెళ్లడం.. తిరిగి ఒంటరిగా దిగివచ్చిన దృశ్యాలు కనిపించాయి. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా రేఖ తనే కూతురిని ట్యాంకులో పడేసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడించింది.
పోలీసులు రేఖపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం కన్నకూతురునే బలి ఇచ్చిన రేఖను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!