BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BWF World Championships 2026: భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ త్రిషా జాలీ, గాయత్రి గోపీచంద్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఫైనల్కు చేరడంలో విఫలమైనప్పటికీ, ప్రపంచ నంబర్-1 జోడీతో హోరాహోరీగా పోరాడి సాధించిన ఈ పతకం భారత మహిళల డబుల్స్కు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో త్రిషా జాలీ–గాయత్రి గోపీచంద్ జోడీ చైనాకు చెందిన ప్రపంచ నంబర్-1, డిఫెండింగ్ ఛాంపియన్లు లియు షెంగ్షు–టాన్ నింగ్ జంటను ఎదుర్కొంది. సుమారు గంటా 11 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత జోడీ 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి చవిచూసింది.
తొలి గేమ్లో అద్భుత పోరాటం
స్వదేశీ ప్రేక్షకుల భారీ మద్దతుతో బరిలోకి దిగిన త్రిషా, గాయత్రి ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఒక దశలో చైనా జోడీ 18-16 ఆధిక్యంలోకి వెళ్లినా, భారత క్రీడాకారిణులు అద్భుతంగా పుంజుకున్నారు. వరుసగా ఐదు పాయింట్లు సాధించి తొలి గేమ్ను 21-18తో సొంతం చేసుకున్నారు. ఇక, రెండో గేమ్లో ఇరు జట్లు 12-12 వరకు నువ్వా-నేనా అన్నట్లుగా పోరాడాయి. ఆ తర్వాత చైనా జోడీ వ్యూహాన్ని మార్చింది. ర్యాలీలను త్వరగా ముగిస్తూ భారత జోడీపై ఒత్తిడి పెంచింది. దీంతో లియు షెంగ్షు–టాన్ నింగ్ 21-13తో రెండో గేమ్ను గెలుచుకున్నారు. నిర్ణయాత్మక మూడో గేమ్లో ప్రపంచ నంబర్-1 జోడీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. భారత జోడీకి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా 21-8తో గేమ్ను, తద్వారా మ్యాచ్ను కైవసం చేసుకుంది.
Also Read
- Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్మన్, గిల్క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
- Gautam Gambhir: సారాంశ్ జైన్కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
- India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
15 ఏళ్ల తర్వాత భారత మహిళల డబుల్స్కు పతకం
సెమీఫైనల్లో ఓడినా త్రిషా, గాయత్రి సాధించిన కాంస్య పతకం భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. 2011 ప్రపంచ ఛాంపియన్షిప్స్లో జ్వాలా గుత్తా–అశ్విని పొన్నప్ప తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్స్లో పతకం సాధించిన రెండో భారత మహిళల డబుల్స్ జోడీగా త్రిషా–గాయత్రి నిలిచారు. దీంతో భారత మహిళల డబుల్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ పతకం కోసం ఎదురుచూస్తున్న 15 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఫైనల్కు చేరలేకపోయినా, ప్రపంచ అత్యుత్తమ జోడీని ఎదుర్కొని చూపిన పోరాట స్ఫూర్తితో త్రిషా, గాయత్రి అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ఇక, త్రిషా జాలీ, గాయత్రి గోపీచంద్ 2026 ఆసియా క్రీడల కోసం భారత బ్యాడ్మింటన్ జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. ప్రపంచ ఛాంపియన్షిప్లో సాధించిన ఈ పతకంతో వారిపై అంచనాలు మరింత పెరిగాయి. రాబోయే ఆసియా క్రీడల్లో కూడా ఈ జోడీ భారత్కు మరో పతకం అందిస్తుందనే ఆశలు అభిమానుల్లో నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!