Job Fraud: ఘరానా మోసం.. యూరప్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Man Cheated Youngsters In The Name Of Job: విదేశాల్లో ఉద్యోగం చేయాలని ఎవరికీ ఉండదు చెప్పండి..? అక్కడ డాలర్లలో సంపాదించి, ఇక్కడ నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని అందరూ భావిస్తుంటారు. చిన్న ఉద్యోగాలు దొరికినా సరే, విదేశాలకు వెళ్లిపోవాలని అనుకుంటారు. దీన్నే అలుసుగా తీసుకొని.. ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. యూరప్ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి.. 150 మందికి పైగా హైదరాబాదీ యువకుల్ని మోసం చేశాడు. ఆ యువకుల వద్ద నుంచి ఏకంగా రెండున్నర కోట్లు కాజేశాడు. చివరికి తాము మోసపోయామని గ్రహించిన ఆ నిరుద్యోగులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Jalumuri Srinivas: పోలీసుల అదుపులో మావోయిస్ట్ జలుమూరి శ్రీనివాస్
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
మహమ్మద్ బషీర్ అనే వ్యక్తి ఫ్యాబ్రల్ ఓవర్సీస్ పేరుతో యూరోపియన్ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఇది చూసిన కొందరు నిరుద్యోగ యువకులు బషీర్ని సంప్రదించారు. యూరప్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని, జీతం అద్భుతంగా వస్తుందని, ఆ జీతంతో ఎంతో విలాసవంతంగా జీవించవచ్చని వారికి ఎర వేశాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు డబ్బులు వసూలు చేశాడు. ఇలా 150 మంది యువకుల నుంచి రెండున్నర కోట్లు తీసుకున్నాడు. వాళ్లందరికీ ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇచ్చి.. త్వరలోనే మీకు కాల్స్ వస్తాయని నమ్మించాడు. అయితే.. నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాలేదు. చివరికి అతడిచ్చిన ఆఫర్ లెట్స్ ఫేక్ అని తేలడంతో.. తాము మోసపోయామని యువకులు గ్రహించారు. ఇంతలోనే బషీర్ ఆఫీస్ బోర్డు తిప్పేశాడు.
Mark Zuckerberg: జుకర్బర్గ్కు భారీ స్థాయిలో భద్రత పెంపు..అందుకేనా!
దీంతో.. చేసేదేమీ లేక బాధితులు పంజాగుట్ట పోలీసుల్ని ఆశ్రయించారు. యూరప్లో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి.. బషీర్ తమను మోసం చేశాడని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల సంఖ్య పెరగడంతో.. పంజాగుట్ట పోలీసులు ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు. సెంట్రల్ క్రైమ్ పోలీసులు 406, 420, 465, 468, 471 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..