Jalumuri Srinivas: పోలీసుల అదుపులో మావోయిస్ట్ జలుమూరి శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు జలుమూరి శ్రీనివాస్ అలియాస్ రైనో ఉన్నట్టు తెలుస్తోంది. జాయింట్ ఆపరేషన్ బలగాలు జలుమూరి శ్రీనివాస్ అలియాస్ రైనో ని అరెస్ట్ చేసినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించడం సంచలనంగా మారింది. 2018 అరకు మాజీ ఎమ్మెల్యేల హత్య కేసులో రైనో నిందితుడుగా ఉన్నాడు. NIA ఛార్జ్ షీటులో రైనో పేరు ఉంది. మల్కన్ గిరి జిల్లా కోటియ బ్లాక్ లో ఆంధ్ర,ఒరిస్సా,ఛత్తీస్ గడ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి రైనో ను పట్టుకున్నారు. రైనోను వెంటనే కోర్టులో హాజరు పరచాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. రైనో ప్రాణానికి హాని జరిగితే పోలీసులు,స్థానిక నాయకులదే బాధ్యత అని హెచ్చరించింది. ఈమేరకు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి జగబంధు ప్రకటన విడుదల చేశారు.
Read Also: Mark Zuckerberg: జుకర్బర్గ్కు భారీ స్థాయిలో భద్రత పెంపు..అందుకేనా!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
2018లో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కలకలం రేపింది. ఈ హత్యలకు సంబంధించి కొందరు నేతలు మావోయిస్టులకు సమాచారం ఇచ్చారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అందులో భాగంగా పలువురు టీడీపీ నేతల కాల్ డేటాను విశ్లేషించారు. అందులో భాగంగా మాజీ ఎంపీటీసీ సుబ్బారావుతో సహా మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీంతో, ఎద్దుల సుబ్బారావు, భీమిలి శోభన్, కమలలపై ఎన్ఐఏ అభియోగాలు మోపి విచారించింది. కిడారి సర్వేశ్వర్ రావు , సోములకు కదిలికలకు సంబంధించిన సమాచారం మావోలకు ఇచ్చారని వీరు ఇచ్చిన సమాచారంతోనే పక్కా ప్లాన్ తో దాడి చేసి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్ రావు ను . సివేరి సోములను రైనో కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న రైనోకు ప్రాణహాని ఉందంటున్నారు మావోయిస్టులు.
Read Also: Komatireddy Venkat Reddy: నల్గొండలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..