Gas Cylinder Scam: శ్మశానవాటిక అడ్డాగా గ్యాస్ దందా.. 400లకు పైగా సిలిండర్లు సీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gas Cylinder Scam: యుద్ధం, గ్యాస్ కృత్రిమ కొరతను ఆసరాగా చేసుకొని బ్లాక్ మార్కెట్లో కమర్షియల్ గ్యాస్సిలెండర్లను అమ్ముతున్న ముఠా దందా గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. శ్మశానవాటికను అడ్డాగా చేసుకొని.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తుంది ముఠా. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి భారీగా కమర్షియల్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్గంజ్లోని మెట్రో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు మహ్మద్ అమీర్, ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు.
READ ALSO: Middle East War Impact: షోరూమ్ల్లో దుమ్ముపడుతోన్న రోల్స్ రాయిస్, ఫెరారీ వంటి లగ్జరీ కార్లు..
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
యుద్ధం ఎఫెక్ట్ కారణంగా.. ప్రస్తుతం గ్యాస్ కొరత కొనసాగుతోంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర వ్యాపారస్తులకు గ్యాస్ సిలిండర్లు సమయానికి దొరకడం లేదు. దీంతో గ్యాస్ సిలెండర్ ఏజెన్సీలలో కొంత మంది బ్లాక్ మార్కెట్కు కమర్షియల్ సిలెండర్లను తరలించి.. అడ్డగోలుగా విక్రయిస్తున్నారు. ప్రధానంగా కమర్షియల్ సిలెండర్లను ఇష్టానుసారంగా, డిమాండ్ ను ఆసరాగా చేసుకొని అమ్ముతున్నారు. మహ్మద్ అమీర్తో పాటు మరో 9 మంది కలిసి ముఠాగా ఏర్పడ్డారు. మెట్రో గ్యాస్ ఏజెన్సీకి వచ్చే సిలెండర్లను పక్కదారి పట్టించారు. పంజాగుట్టలోని శ్మశానవాటికను అడ్డాగా చేసుకొని.. దందా స్టార్ట్ చేశారు. శ్మశానవాటిక సిబ్బందిని మేనేజ్ చేసి.. ఆ ప్రాంతాన్ని గోదాంగా మార్చారు. కమర్షియల్ సిలెండర్లను శ్మశానవాటికలో డంప్ చేసి.. అక్కడి నుంచి పలు వాహనాల్లో బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు.
కమర్షియల్ సిలెండర్లకు బ్లాక్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో 2100 రూపాయలు ఉండే సిలెండర్ను మహ్మద్ అమీర్ ముఠా 6 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ ముఠాకు సంబంధించిన పక్క సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్లో 414 కమర్షియల్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. సమాజంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఆసరాగా చేసుకొని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుల నుంచి హెచ్పీ ఫుల్ గ్యాస్ సిలిండర్ 47 కిలోలవి 30, హెచ్పీ గ్యాస్ సిలిండర్ నిండువి 19 కిలోలవి 148, ఖాళీ సిలిండర్లు 19 కిలోలవి 192, ఐదు కిలోల ఫుల్ సిలిండర్లు 35, 5 కిలోల ఖాళీ సిలిండర్లు 9, 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సిలిండర్లను సివిల్ సప్లై అధికారులకు అప్పగిస్తున్నామని తెలిపారు.
READ ALSO: Father Murder Case: జాలి లేని జన్మ.. మద్యం మత్తులో కన్న తండ్రినే కడతేర్చిన దుర్మార్గుడు!
తాజావార్తలు
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..